News February 26, 2025
మళ్లీ థియేటర్లలోకి బ్లాక్ బస్టర్ సినిమా

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ ‘ఆదిత్య 369’ మళ్లీ థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్ధమైంది. 1991లో విడుదలైన ఈ చిత్రం రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ సమ్మర్లో ఈ మూవీని రీరిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటన చేశారు. కాగా, ‘ఆదిత్య 369’కు సీక్వెల్ తీయనున్నట్లు ఇప్పటికే బాలయ్య ప్రకటించారు.
Similar News
News March 27, 2025
డైలీ ట్రాన్జాక్షన్లకు UPI, భారీ ఖర్చులకు క్రెడిట్కార్డు

డైలీ ట్రాన్జాక్షన్ల కోసం UPIను అత్యధికంగా వినియోగిస్తున్న యువత భారీ కొనుగోళ్లకు మాత్రం క్రెడిట్ కార్డును వాడేందుకే ఇష్టపడుతోందని కివీ, అనోమర్ సర్వే తెలిపింది. నెల రోజులు వడ్డీలేని సులభ రుణం దొరకడం, సేవింగ్స్ అకౌంట్లలో డబ్బులు అలాగే ఉండటమే ఇందుకు కారణమని వెల్లడించింది. ఈజీ యాక్సెస్, భారీ రీచ్ వల్ల 70% యువ కస్టమర్లు రోజువారీ ఖర్చులకు, 81% మంది వ్యక్తిగత లావాదేవీలకు UPIని వాడుతున్నారని పేర్కొంది.
News March 27, 2025
పుతిన్కి టైమ్ దగ్గర పడింది: జెలెన్స్కీ

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కి టైమ్ దగ్గరపడిందని, త్వరలోనే మరణిస్తాడని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చస్తేనే ఇరు దేశాల మధ్య యుద్ధం ఆగిపోతుందని పేర్కొన్నారు. ఇది కచ్చితంగా నిజమని చెప్పారు. పుతిన్ ఆరోగ్యంపై పలు ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో జెలెన్స్కీ ఇలా వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. మరోవైపు ఇరుదేశాల మధ్య సయోధ్య కుదర్చాలని జెలెన్స్కీ USను కోరుతున్నారు.
News March 27, 2025
ఆ భూమి వేలాన్ని నిలిపివేయండి: కిషన్ రెడ్డి

TG: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూమిని వేలం వేయడాన్ని విరమించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఆ ప్రాంతంలో అనేక వృక్ష, జంతుజాలం, సరస్సులు ఉన్నాయని పేర్కొన్నారు. గతంలో ప్రభుత్వ భూముల విక్రయాన్ని రేవంత్ వ్యతిరేకించారని గుర్తు చేశారు.