News December 2, 2024

రక్తదాన ఉద్యమకారిణి కాంతా క్రిషెన్ మృతి

image

భారత్‌లో స్వచ్ఛంద రక్తదానానికి విశేషంగా ప్రచారం కల్పించిన పద్మశ్రీ కాంతా క్రిషెన్(95) కన్నుమూశారు. గడచిన రెండు వారాలుగా వృద్ధాప్య సంబంధిత సమస్యలతో ఆమె అనారోగ్యంగా ఉన్నారని, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న కన్నుమూశారని కుటుంబీకులు తెలిపారు. చండీగఢ్ ఆమె ప్రారంభించిన స్వచ్ఛంద రక్తదాన ఉద్యమం దేశవ్యాప్తంగా విస్తరించింది. ఆ సేవలకు గాను క్రిషెన్‌ను 1972లో కేంద్రం పద్మశ్రీతో గౌరవించింది.

Similar News

News November 3, 2025

అత్త యేలిన కోడలూ, చిత్త పట్టిన చేనూ

image

పూర్వకాలంలో, అత్త ఇంటి వ్యవహారాలను, కోడలి ప్రవర్తనను, పనులను దగ్గరుండి పర్యవేక్షించేవారు. ఆ పర్యవేక్షణ, క్రమశిక్షణ వల్ల కోడలు ఇంటి పనులన్నీ నేర్చుకుని సమర్థవంతంగా వ్యవహరించేదని, దాని వల్ల ఆ ఇల్లు చక్కగా ఉండేదని నమ్మేవారు. అలాగే రైతు తన మనసు పెట్టి, ఇష్టంగా, శ్రద్ధగా సాగు చేసుకునే పొలం మంచి దిగుబడిని, ఫలితాన్ని ఇస్తుంది. ఏదైనా ఒక పనిని అంకిత భావంతో చేస్తే మంచి ఫలితం వస్తుందని ఈ సామెత చెబుతుంది.

News November 3, 2025

ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు

image

ఏపీలోని కర్నూలు, తిరుపతిలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. మిగతా జిల్లాల్లోనూ తేలికపాటి వర్షాలకు ఛాన్స్ ఉందని వెల్లడించింది. మరోవైపు TGలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD పేర్కొంది. నిన్న తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల వర్షం దంచికొట్టింది. యాదాద్రిలోని చౌటుప్పల్‌లో 6.1cm, నిజామాబాద్‌లోని మంచిప్పలో 5.4cmల వర్షపాతం నమోదైంది.

News November 3, 2025

రోజూ శివలింగానికి పెరుగుతో అభిషేకం చేస్తే..

image

శివలింగానికి రోజూ పెరుగుతో అభిషేకం చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. ఈ అభిషేకం ఆరోగ్యంతో పాటు, బలం, యశస్సు, కీర్తిని ప్రసాదిస్తాయని పండితులు పేర్కొంటున్నారు. ‘పెరుగు చాలా శుభప్రదమైనది. పౌష్టికపరమైనది. ఈ అభిషేకం భక్తుల శారీరక, మానసిక రోగాలను మాయం చేస్తుంది. సమాజంలో గౌరవం, కీర్తి ప్రతిష్ఠలు పెరిగి, మంచి వ్యక్తిత్వంతో జీవించడానికి శివానుగ్రహం లభిస్తుంది’ అంటున్నారు.