News December 2, 2024

రక్తదాన ఉద్యమకారిణి కాంతా క్రిషెన్ మృతి

image

భారత్‌లో స్వచ్ఛంద రక్తదానానికి విశేషంగా ప్రచారం కల్పించిన పద్మశ్రీ కాంతా క్రిషెన్(95) కన్నుమూశారు. గడచిన రెండు వారాలుగా వృద్ధాప్య సంబంధిత సమస్యలతో ఆమె అనారోగ్యంగా ఉన్నారని, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న కన్నుమూశారని కుటుంబీకులు తెలిపారు. చండీగఢ్ ఆమె ప్రారంభించిన స్వచ్ఛంద రక్తదాన ఉద్యమం దేశవ్యాప్తంగా విస్తరించింది. ఆ సేవలకు గాను క్రిషెన్‌ను 1972లో కేంద్రం పద్మశ్రీతో గౌరవించింది.

Similar News

News February 19, 2025

సెమిస్టర్ వారీగా ఫీజు రీయింబర్స్‌మెంట్: లోకేశ్

image

AP: ఇకపై ఫీజు రీయింబర్స్‌మెంట్ సొమ్మును సెమిస్టర్ వారీగా విడుదల చేస్తామని మంత్రి లోకేశ్ అన్నారు. గత ప్రభుత్వం రూ.4వేల కోట్ల రీఎంబర్స్‌మెంట్ బకాయిలు పెట్టిందని తెలిపారు. ఆర్థికంగా కుదుటపడ్డాక వాటిని చెల్లిస్తామని తిరుపతి పద్మావతి ఇంజినీరింగ్ కాలేజీలో ఆయన చెప్పారు. తాను జగన్‌పై చేసిన పోరాటం కంటే విద్యావ్యవస్థలో సంస్కరణల కోసం 3రెట్లు అధికంగా చంద్రబాబుగారితో పోరాడుతున్నానని లోకేశ్ సరదాగా అన్నారు.

News February 19, 2025

కొత్త సీఎంకు మా మద్దతు ఉంటుంది: కేజ్రీవాల్

image

ఢిల్లీ సీఎంగా ఎన్నికైన రేఖా గుప్తాకు మాజీ సీఎంలు అర్వింద్ కేజ్రీవాల్, ఆతిశీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు బీజేపీ ఇచ్చిన హామీల వల్లే ఈ అధికారం వచ్చిందని, ఆ హామీలను నెరవేరుస్తారని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఢిల్లీ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం కొత్త సీఎంకు ప్రతి పనిలో అవసరమైన మద్దతు ఇవ్వడానికి తమ పార్టీ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.

News February 19, 2025

KCRకు ప్రతిపక్ష హోదా ఎందుకు?: TPCC చీఫ్

image

TG: ఫాం హౌస్‌కి పరిమితమైన KCRకు ప్రతిపక్ష హోదా ఎందుకు అని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పినా ఆయన తీరు మారలేదని, అధికారం కోసం గుంట నక్కలా ఎదురు చూసినా ఫలితం ఉండదని అన్నారు. ‘KCR పాలనకు INC పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉంది. పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడటానికి KCRకు సిగ్గు ఉండాలి. గతంలో మా MLAలను చేర్చుకున్నప్పుడు మీ సోయి ఎటు పోయింది’ అని మండిపడ్డారు.

error: Content is protected !!