News February 21, 2025
త్వరలో పబ్లిక్ ఇష్యూకు boAt

కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ boAt లైఫ్స్టైల్ త్వరలో IPOకు వస్తున్నట్టు తెలిసింది. రూ.2000 కోట్లు సమీకరించడమే లక్ష్యంగా FY26లో సెబీ వద్ద రహస్యంగా DRHP దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు CNBC TV18 పేర్కొంది. వాల్యుయేషన్ను $1.5B పైగా కోరుతోందని తెలిసింది. 2022లోనే పేపర్లు సబ్మిట్ చేసిన బోట్ మార్కెట్ పరిస్థితులు బాగాలేకపోవడంతో నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. PVT క్యాపిటల్ ద్వారా $60M సమీకరించింది.
Similar News
News December 4, 2025
ఉప్పాడ మత్స్యకారులను ఆదుకుంటాం: పవన్

AP: కాకినాడ(D) ఉప్పాడ మత్స్యకారులను ఆదుకుంటామని వారితో సమావేశం సందర్భంగా Dy.CM పవన్ అన్నారు. ‘సముద్ర జలాల కాలుష్య సమస్యపై శాస్త్రీయ పరిశోధన చేస్తాం. జాలర్ల ఆదాయం పెంపు, మత్స్య సంపద వృద్ధి, తీర ప్రాంత రక్షణ, యువత, మహిళలకు ఉపాధి కల్పన లక్ష్యంగా యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నాం. గత ప్రభుత్వ తప్పిదాలతో ప్రజాధనం వృథా అయింది. చేసిన పనులే చేయాల్సిన దుస్థితిని అప్పటి పాలకులు తెచ్చారు’ అని ఆరోపించారు.
News December 4, 2025
జెరుసలేం మాస్టర్స్ విజేతగా అర్జున్ ఇరిగేశీ

భారత చెస్ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగేశీ సత్తా చాటారు. ఫైనల్లో మాజీ వరల్డ్ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ను ఓడించి జెరుసలేం మాస్టర్స్-2025 టైటిల్ను సొంతం చేసుకున్నారు. తొలుత రెండు ర్యాపిడ్ గేమ్లు డ్రా కాగా మొదటి బ్లిట్జ్ గేమ్లో విజయం సాధించారు. అర్జున్కు టైటిల్తో పాటు దాదాపు రూ.50లక్షల (USD 55,000) ప్రైజ్ మనీ అందజేయనున్నారు. ఈ 22ఏళ్ల కుర్రాడి స్వస్థలం తెలంగాణలోని హన్మకొండ.
News December 4, 2025
డిసెంబర్ 04: చరిత్రలో ఈ రోజు

1829: సతీ సహగమన దురాచార నిషేధం
1910: మాజీ రాష్ట్రపతి ఆర్.వెంకట్రామన్ జననం
1919: మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్ జననం
1922: సంగీత దర్శకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు(ఫొటోలో) జననం
1977: బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ జననం
1981: నటి రేణూ దేశాయ్ జననం
2021: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య మరణం
– భారత నౌకాదళ దినోత్సవం


