News February 21, 2025

త్వరలో పబ్లిక్ ఇష్యూకు boAt

image

కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ boAt లైఫ్‌స్టైల్ త్వరలో IPOకు వస్తున్నట్టు తెలిసింది. రూ.2000 కోట్లు సమీకరించడమే లక్ష్యంగా FY26లో సెబీ వద్ద రహస్యంగా DRHP దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు CNBC TV18 పేర్కొంది. వాల్యుయేషన్‌ను $1.5B పైగా కోరుతోందని తెలిసింది. 2022లోనే పేపర్లు సబ్మిట్ చేసిన బోట్ మార్కెట్ పరిస్థితులు బాగాలేకపోవడంతో నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. PVT క్యాపిటల్ ద్వారా $60M సమీకరించింది.

Similar News

News January 8, 2026

ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి

image

TG: హైదరాబాద్ శివారు మోకిల పరిధిలోని మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు చెట్టును ఢీకొట్టడంతో అందులో ఉన్న నలుగురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో విద్యార్థిని నక్షత్ర గాయపడ్డారు. మృతులను సూర్యతేజ(20), సుమిత్(20), శ్రీనిఖిల్(20), రోహిత్‌(18)గా గుర్తించారు. వీరంతా ICFA ఇన్‌స్టిట్యూట్‌లో చదువుతున్నట్లు తెలుస్తోంది. కారులో మోకిల నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం జరిగింది.

News January 8, 2026

మిరప పంటలో బూడిద తెగులు – నివారణ

image

మిరప పంటలో బూడిద తెగులు ఎక్కువగా డిసెంబర్ నుంచి ఫిబ్రవరి నెలల్లో వస్తుంది. పొడి లాంటి తెల్లటి మచ్చలు ఆకుల కింది భాగంలో కనబడతాయి. ఆకు పైభాగంలో పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. ఇలా రంగుమారిన ఆకులు రాలిపోవడం జరుగుతుంది. ఈ తెగులు నివారణకు Mycobutanil అనే మందు 1.5 గ్రాములను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. లేదా azoxystrbin Tebucinazole 1.5ml మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.

News January 8, 2026

ఇంట్లో దేవుడి చిత్రపటాలు ఏ దిశలో ఉంటే ఉత్తమం?

image

పూజ గదిలో చిత్రపటాలను ఎప్పుడూ తూర్పు లేదా ఉత్తర దిశ ముఖంగా ఉండేలా చూసుకోవాలి. అంటే మనం పూజ చేసేటప్పుడు తూర్పు వైపునకు తిరిగి ఉండాలి. లక్ష్మీదేవి, గణపతి, సరస్వతి పటాలను కలిపి ఉంచడం శుభకరం. పగిలిన లేదా చినిగిపోయిన పటాలను పూజ గదిలో అస్సలు ఉంచకూడదు. పటాలకు ప్రతిరోజు గంధం, కుంకుమ బొట్లు పెట్టి అలంకరించుకోవడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. అలాగే ప్రశాంతత లభిస్తుందని పండితులు చెబుతున్నారు.