News October 25, 2024

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు కాల్

image

శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు కాల్ రావడంతో కలకలం రేగింది. హైదరాబాద్ నుంచి చండీగఢ్ వెళుతున్న ఇండిగో విమానంలో బాంబు పెట్టినట్లు అధికారులకు ఫోన్ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు ప్రయాణికులను కిందకి దించి తనిఖీలు చేస్తున్నారు. ఆ విమానంలో 130 మంది ప్రయాణికులున్నట్లు తెలుస్తోంది.

Similar News

News October 25, 2024

బడ్జెట్ రూ.45 కోట్లు.. కలెక్షన్లు రూ.50వేలు

image

భారీ అంచనాలతో రూపొందించిన సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేక భారీ నష్టాలను మిగిలిస్తుంటాయి. అలాంటి కోవకు చెందిన చిత్రమే ‘ది లేడీ కిల్లర్‌’. బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్, భూమి పెడ్నేకర్‌ జంటగా రూ.45 కోట్ల బడ్జెట్‌తో అజయ్ బాల్ ఈ సినిమాను తెరకెక్కించారు. గతేడాది నవంబర్‌లో ‘ది లేడీ కిల్లర్‌’ రిలీజవగా భారత సినీ చరిత్రలో బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. ఇది కేవలం రూ.50వేలు మాత్రమే రాబట్టగలిగింది.

News October 25, 2024

జాలీ ట్రిప్ అని పిలిచి రైడ్స్

image

కేరళలో తొలిసారి GST అధికారులు కమాండో తరహా ఆపరేషన్‌తో 108 కేజీల అక్రమ బంగారం సీజ్ చేశారు. KLలోని 700 మంది ఆఫీసర్లను సరదా ట్రిప్ అని గోల్డ్ హబ్ త్రిస్సూర్‌లో ఓ రిసార్టుకు పిలిచారు. అంతా చేరాక ఆపరేషన్ ‘గోల్డ్ టవర్’ గురించి చెప్పి దాడులకు పంపారు. ఈ హఠాత్ పరిణామంతో కొన్ని షాపుల సిబ్బంది పసిడితో పారిపోతుంటే వెంబడించి పట్టుకున్నారు. KLలో బంగారం అమ్మకాల గణాంకాలు, పన్ను చెల్లింపుల మధ్య భారీ తేడా ఉంది.

News October 25, 2024

Stock Market: మళ్లీ నష్టాలు

image

ఎఫ్ఐఐల వ‌రుస అమ్మ‌కాల నేప‌థ్యంలో దేశీయ ఇన్వెస్ట‌ర్ల బై ఆన్ డిప్ స్ట్రాట‌జీ వ‌ర్కౌట్ కాక‌పోవ‌డంతో స్టాక్ మార్కెట్లు భారీ న‌ష్టాల‌ను చ‌విచూస్తున్నాయి. శుక్ర‌వారం సెన్సెక్స్ 662 పాయింట్ల నష్టంతో 79,402 వద్ద, నిఫ్టీ 218 పాయింట్లు కోల్పోయి 24,180 వద్ద స్థిరపడ్డాయి. ITC 2.24%, Axis Bank 1.85%, BEL 1.55% లాభపడ్డాయి. IndusIndBK 19%, Adani Ent 5%, BPCL 5% మేర నష్టపోయాయి.