News April 2, 2024

ఇద్దరూ సేమ్ రన్స్.. కానీ పరాగ్‌కే ఆరెంజ్ క్యాప్ ఎందుకంటే?

image

IPL-2024: ఇప్పటివరకు జరిగిన ప్రస్తుత సీజన్‌లో విరాట్ కోహ్లీ, రియాన్ పరాగ్ అత్యధిక రన్స్ చేశారు. కానీ RR ప్లేయర్ పరాగ్ క్యాప్ ధరించారు. రూల్స్ ప్రకారం.. ఇద్దరు క్రికెటర్లు సేమ్ రన్స్ చేస్తే.. అత్యధిక స్ట్రైక్ రేట్ ఉన్న ప్లేయర్‌కు ఆరెంజ్ క్యాప్ ఇస్తారు. పరాగ్ 160.17 స్టైక్ రేట్‌తో 181 రన్స్ చేయగా, విరాట్ 141.40 స్టైక్ రేట్‌తో 181 పరుగులు చేశారు.

Similar News

News April 25, 2025

రోజూ 40 రోటీలు తినేవాడిని: జైదీప్

image

తనకు 28 ఏళ్ల వయసు వచ్చే వరకు రోజూ 40 రోటీలు తిని, లీటరున్నర పాలు తాగేవాడినని ‘పాతాళ్‌లోక్’ ఫేమ్ జైదీప్ అహ్లావత్ వెల్లడించారు. అయినా తాను 70KGల బరువు దాటలేదని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఒక వయసు దాటాక తిండిలో మార్పులు చేసుకోవాలని, అప్పుడే జీవనశైలి బాగుంటుందని చెప్పారు. ఎక్కడ షూటింగ్ జరిగినా ఇప్పటికీ ఇంటి ఆహారమే తింటానన్నారు. విదేశాలకు వెళ్లినప్పుడు అందుబాటులో ఉన్నవాటితో సర్దుకుంటానని పేర్కొన్నారు.

News April 25, 2025

ప్రత్యామ్నాయ మార్గాల్లో విమాన ప్రయాణాలు

image

పాకిస్థాన్ గగనతలాన్ని మూసివేయడంపై భారత విమానయాన సంస్థలు స్పందించాయి. US, UK, యూరప్, పశ్చిమాసియా దేశాలకు ప్రయాణించే విమానాలు ప్రత్యామ్నాయ సుదూర మార్గంలో వెళ్లాల్సి ఉంటుందని తెలిపాయి. దీనివల్ల ప్రయాణ సమయం పెరుగుతుందని, అసౌకర్యానికి చింతిస్తున్నామని ఎయిర్ ఇండియా, ఇండిగో పేర్కొన్నాయి. ట్రావెల్ టైమ్ పెరగడంతో టికెట్ల ధరలు కూడా అధికమయ్యే అవకాశం ఉందని నిపుణుల అంచనా.

News April 25, 2025

కలెక్షన్ల సంభవం.. 2 వారాల్లో రూ.172 కోట్లు!

image

హీరో అజిత్ నటించిన మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ థియేటర్లలో కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది. తమిళనాడులో విడుదలైన రెండు వారాల్లోనే రూ.172.3 కోట్లు వసూలు చేసినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతగా వ్యవహరించింది.

error: Content is protected !!