News April 29, 2024
కుంచె పట్టిన బ్రహ్మ.. రాజా రవివర్మ!

భారత కళాచరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే పేరు రాజా రవివర్మ. స్వదేశీ, పాశ్చాత్య చిత్రకళల్ని కలగలిపి జీవం ఉట్టిపడే చిత్రాలను గీయడం ఆయన శైలి. 1873లో వియన్నాలో తన పెయింటింగ్స్కు మొదటి బహుమతి అందుకున్న అనంతరం ఆయన పేరు మారుమోగింది. నేటికీ ఎవరైనా అమ్మాయి చూడచక్కగా ఉంటే రవివర్మ బొమ్మతో పోల్చడం కనిపిస్తుంటుంది. 1848, ఏప్రిల్ 29న కేరళలో జన్మించిన ఆయన 1906, అక్టోబరు 2న కన్నుమూశారు. నేడు ఆయన జయంతి.
Similar News
News April 15, 2026
WGL: 11 నెలలుగా అందని ఉపకార వేతనాలు

వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్ పరిధిలో ఇంటర్న్షిప్ చేస్తున్న ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్కు 11 నెలలుగా ఉపకార వేతనాలు రాలేదు. వారికి ప్రతి నెల రూ.5 వేల ఉపకార వేతనాలు ప్రభుత్వం ఇస్తుంది. గతేడాది జూన్లో కేఎంసీలో 12 మంది ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఇంటర్న్షిప్లో చేరారు. ప్రతి నెల చెల్లించాల్సిన ఉపకార వేతనాలు ఇప్పటికీ రాలేదు. ప్రభుత్వం విడుదల చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.
News April 15, 2026
మరింత పెరగనున్న వాహనాల ధరలు?

నిర్వహణ ఖర్చులు పెరిగాయంటూ ఇప్పటికే ఆటోమొబైల్ కంపెనీలు వాహనాల ధరలు పెంచుతున్నాయి. యుద్ధం మరింత కాలం కొనసాగితే ఉత్పత్తి వ్యయం పరిమితికి మించి పెరిగి రేట్లు మరింత పెంచాల్సి రావొచ్చని భారత వాహన తయారీదారుల సమాఖ్య(సియామ్) అధ్యక్షుడు శైలేశ్ చంద్ర తెలిపారు. కమోడిటీ ధరలు ఏమేర పెరుగుతాయనేది 4-5 వారాల్లో స్పష్టత రావొచ్చన్నారు. ఆ తర్వాతే వాహనాల రేట్ల పెంపుపై నిర్ణయం తీసుకోవడానికి వీలవుతుందని వెల్లడించారు.
News April 15, 2026
US-ఇరాన్ చర్చలపై వాన్స్ కీలక వ్యాఖ్యలు

అమెరికా, ఇరాన్ మధ్య దశాబ్దాలుగా నమ్మకం లేకపోవడమే పెద్ద అడ్డంకి అని JD వాన్స్ అభిప్రాయపడ్డారు. దాన్ని తొలగించడం అంత సులభం కాదని పేర్కొన్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న సీజ్ఫైర్ను పూర్తిస్థాయి శాంతి ఒప్పందంగా మార్చడం పెద్ద ఛాలెంజ్ అన్నారు. ఏళ్ల తరబడిగా ఉన్న విభేదాలు ఒక్క రాత్రిలో పరిష్కారం కావని స్పష్టం చేశారు. మరోసారి ఇరుపక్షాలు చర్చలకు సిద్ధమవుతున్న తరుణంలో వాన్స్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.


