News July 12, 2024

చంద్రబాబే ఏపీకి బ్రాండ్ అంబాసిడర్: భరత్

image

APకి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని పరిశ్రమల శాఖ మంత్రి టి.జి.భరత్ వెల్లడించారు. విశాఖలో పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, CII సభ్యులతో ఆయన భేటీ అయ్యారు. ‘పారిశ్రామికవేత్తలకు మెరుగైన రాయితీలు ఇవ్వడంతో పాటు పరిశ్రమలకు రాయితీలు ఇవ్వడంలో ముందుంటాం. వ్యాపారం సులభతరం చేయడంపై త్వరలో CMతో చర్చించి పాలసీని రూపొందిస్తాం. ఏపీకి చంద్రబాబే బ్రాండ్ అంబాసిడర్’ అని పేర్కొన్నారు.

Similar News

News February 11, 2025

Stock Markets Crash: Rs10లక్షల కోట్ల నష్టం

image

దేశీయ స్టాక్‌మార్కెట్లు రక్తమోడుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి నెగటివ్ సంకేతాలు రావడం, డాలర్ పెరుగుదల, ట్రంప్ ఆంక్షల దెబ్బకు సూచీలు కుదేలయ్యాయి. నిఫ్టీ 330 పాయింట్లు నష్టపోయి 23,048, సెన్సెక్స్ 1074 పాయింట్లు ఎరుపెక్కి 76,223 వద్ద ట్రేడవుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు ఈ ఒక్కరోజే రూ.10లక్షల కోట్ల మేర సంపదను కోల్పోయారు. అదానీ ఎంటర్‌ప్రైజెస్, గ్రాసిమ్ మినహా నిఫ్టీలో అన్ని షేర్లూ క్రాష్ అయ్యాయి.

News February 11, 2025

దేవుడి పేరుతో దాడులు దురదృష్టకరం: మంత్రి

image

TG: వీర రాఘవరెడ్డి, అతడి అనుచరుల దాడిలో గాయపడ్డ చిలుకూరు ఆలయ అర్చకుడు రంగరాజన్‌ను మంత్రి శ్రీధర్ బాబు పరామర్శించారు. దాడి ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. దేవుడి పేరు మీద దాడులు చేయడం దురదృష్టకరమన్నారు. నిందితుల్లో ఇప్పటికే కొందరిని అరెస్టు చేశామని, ఆలయం వద్ద భద్రత పెంచుతామని చెప్పారు. అటు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, ఇతర నేతలు సైతం రంగరాజన్‌కు ఫోన్ చేసి పరామర్శించారు.

News February 11, 2025

1/70 చట్టాన్ని తొలగించే ప్రసక్తే లేదు: చంద్రబాబు

image

AP: గిరిజనుల అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. <<15423800>>1/70 చట్టాన్ని<<>> తొలగించే ప్రసక్తే లేదని ఆయన ట్వీట్ చేశారు. ‘గిరిజన జాతుల అస్థిత్వాన్ని కాపాడుతాం. వారి విద్య, వైద్యం, జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తాం. గిరిజన ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొస్తాం. 1/70 చట్టంపై దుష్ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దు. ఆందోళన, అపోహలతో గిరిజనులు ఆందోళన చెందొద్దు’ అని సీఎం పేర్కొన్నారు.

error: Content is protected !!