News April 14, 2024

సీఎం జగన్ బస్సు యాత్రకు బ్రేక్

image

AP: నేడు కొనసాగాల్సిన మేమంతా సిద్ధం యాత్రకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విరామం ప్రకటించారు. గాయం తగ్గేవరకు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తదుపరి షెడ్యూల్‌కు సంబంధించిన వివరాలను నేడు వైసీపీ వెల్లడించనుంది. ప్రస్తుతం జగన్ కేసరపల్లి క్యాంప్‌లో బస చేస్తున్నారు. మరోవైపు జగన్‌పై దాడి ఘటనపై నివేదిక పంపాలని సీపీని ఈసీ ఆదేశించింది.

Similar News

News March 23, 2026

యుద్ధంతో అమెరికాకు ₹7,520 కోట్ల నష్టం

image

పశ్చిమాసియాలోని అమెరికన్ మిలిటరీ బేస్‌లపై ఇరాన్ జరిపిన వైమానిక దాడుల వల్ల USకు ₹7,520 కోట్ల నష్టం వాటిల్లిందని BBC, CSIS నివేదిక వెల్లడించింది. యుద్ధం మొదలైన తొలి 2 వారాల్లోనే ఈ నష్టం జరిగినట్లు అంచనా. జోర్డాన్‌లోని థాడ్ రాడార్ వ్యవస్థ ధ్వంసం అవ్వడం వల్ల సుమారు ₹4,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లు US డిఫెన్స్ సిస్టమ్స్‌ను ఛేదించి ఈ విధ్వంసం సృష్టించాయి.

News March 23, 2026

ఖరీఫ్‌కు కష్టమే.. తగ్గిన యూరియా తయారీ!

image

హార్ముజ్ జలసంధి మూతపడటంతో భారత్‌కు రావాల్సిన LNG సరఫరా నిలిచిపోయింది. దీంతో దేశీయంగా యూరియా ఉత్పత్తి 50% పైగా పడిపోయింది. గ్యాస్ కొరత వల్ల గెయిల్, IOC వంటి సంస్థలు యూరియా ప్లాంట్లకు సప్లై తగ్గించాయి. ఫలితంగా వచ్చే ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన 170-180 లక్షల టన్నుల యూరియా లభ్యతపై ఆందోళన మొదలైంది. ప్రస్తుతం దేశంలో కేవలం 62 లక్షల టన్నుల నిల్వలు మాత్రమే ఉన్నాయి. చైనా నుంచి కూడా దిగుమతులు తగ్గాయి.

News March 23, 2026

రూ.లక్షన్నర కోట్ల పెట్టుబడి.. నేడు ఆర్సెలార్ స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన

image

AP: అనకాపల్లి(D) నక్కపల్లి(M)లో ఆర్సెలార్ మిట్టల్-నిప్పన్ స్టీల్ ప్లాంట్‌కు CM CBN ఇవాళ సాయంత్రం శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం బహిరంగసభలో ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమానికి Dy.CM పవన్, కేంద్ర, రాష్ట్ర మంత్రులు హాజరుకానున్నారు. దాదాపు రూ.లక్షన్నర కోట్ల పెట్టుబడితో నిర్మించే ఈ ప్లాంట్ వల్ల 1.25L మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. 2029 నాటికి ఉత్పత్తి ప్రారంభించి 2033కు పనులు పూర్తిచేయాలనేది లక్ష్యం.