News April 25, 2024

భారత్‌లో టెస్లా ఎంట్రీకి బ్రేక్?

image

భారత్‌లో పెట్టుబడికి ఎలాన్ మస్క్ ఆసక్తి చూపించడంతో త్వరలోనే ఇక్కడ టెస్లా ప్లాంట్ వస్తుందని ట్రేడ్ వర్గాలు భావించాయి. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఇప్పట్లో భారత్‌లో టెస్లా ఎంట్రీకి ఛాన్స్ లేదట. బడ్జెట్ కార్లు తేవడంపై దృష్టిపెట్టిన టెస్లా, ఉన్న ఫ్యాక్టరీల్లోనే తయారీ కొనసాగించాలని నిర్ణయించిందట. అందుకే మెక్సికో, భారత్‌కు ప్లాంట్లు విస్తరించాలన్న ఆలోచనను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.

Similar News

News January 19, 2026

మున్సిపల్ ఎన్నికలు.. మంత్రులకు ఇన్‌ఛార్జ్‌ల బాధ్యతలు

image

TG: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మంత్రులను లోక్‌సభ నియోజకవర్గాల వారీగా ఇన్‌ఛార్జ్‌లుగా CM రేవంత్ నియమించారు. NZB-ఉత్తమ్, మల్కాజిగిరి-కోమటిరెడ్డి, KNR-తుమ్మల, నల్గొండ-అడ్లూరి లక్ష్మణ్, WGL-పొంగులేటి, చేవెళ్ల-శ్రీధర్ బాబు, KMM-సురేఖ, మహబూబాబాద్-పొన్నం, MBNR-దామోదర, జహీరాబాద్-అజహరుద్దీన్, MDK-వివేక్, నాగర్ కర్నూల్-వాకిటి శ్రీహరి, భువనగిరి-సీతక్క, PDPL-జూపల్లి, ADB-సుదర్శన్ రెడ్డి(ప్రభుత్వ సలహాదారు)

News January 19, 2026

మీరు చేస్తేనే పిల్లలు నేర్చుకుంటారు

image

కొందరు తల్లిదండ్రులు మా పిల్లలకు ఏం చెబుతున్నా చెయ్యట్లేదు. మాట వినట్లేదు అని బాధపడుతుంటారు. కానీ పెద్దలను చూసే పిల్లలు ఏదైనా పాటిస్తారంటున్నారు నిపుణులు. మనం తీసుకొనే ఆహారం నుంచి వ్యాయామం వరకు వాళ్లు చూసే నేర్చుకుంటారు. సానుకూలంగా ఆలోచించడం, క్లిష్టపరిస్థితుల్లో ధైర్యంగా ఉండటం పేరెంట్స్‌ని చూసే నేర్చుకుంటారు. అలాగే వారి మాటలను శ్రద్ధగా వింటేనే తమ మనసులోని మాటలు స్వేచ్ఛగా పంచుకోగలుగుతారు.

News January 19, 2026

పండ్లు Vs పండ్ల రసాలు.. ఏవి బెటర్?

image

పండ్ల రసం తాగడం కంటే నేరుగా పండ్లను తినడమే చాలా ఉత్తమమని న్యూట్రిషనిస్టులు సూచిస్తున్నారు. ‘ఫ్రూట్స్‌లో ఉండే పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రిస్తుంది. కానీ పండ్ల రసంలో పీచుపదార్థాలు ఎక్కువగా తొలగిపోతాయి. దీంతో చక్కెర స్థాయులు వేగంగా పెరుగుతాయి. డయాబెటిస్, PCOD, ఒబెసిటీ, గుండె వ్యాధులు ఉన్న వారికి జ్యూస్ మంచిది కాదు’ అని చెబుతున్నారు.