News April 25, 2024
భారత్లో టెస్లా ఎంట్రీకి బ్రేక్?
భారత్లో పెట్టుబడికి ఎలాన్ మస్క్ ఆసక్తి చూపించడంతో త్వరలోనే ఇక్కడ టెస్లా ప్లాంట్ వస్తుందని ట్రేడ్ వర్గాలు భావించాయి. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఇప్పట్లో భారత్లో టెస్లా ఎంట్రీకి ఛాన్స్ లేదట. బడ్జెట్ కార్లు తేవడంపై దృష్టిపెట్టిన టెస్లా, ఉన్న ఫ్యాక్టరీల్లోనే తయారీ కొనసాగించాలని నిర్ణయించిందట. అందుకే మెక్సికో, భారత్కు ప్లాంట్లు విస్తరించాలన్న ఆలోచనను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.
Similar News
News January 18, 2025
జేసీ ప్రభాకర్ రెడ్డిపై MAAకు నటి ఫిర్యాదు
టీడీపీ నేత <<15051797>>జేసీ ప్రభాకర్ రెడ్డిపై<<>> ఫిల్మ్ ఛాంబర్, MAAకు నటి మాధవీలత ఫిర్యాదు చేశారు. ఆయన తన పట్ల దారుణంగా మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వ్యక్తిత్వ హననం చేస్తూ సినిమా వాళ్లపై ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. జేసీ ప్రభాకర్ క్షమాపణ చెబితే సరిపోదని, ఆయనపై న్యాయ పోరాటం చేస్తానని చెప్పారు. ఆయన వ్యాఖ్యలపై ఫిల్మ్ ఇండస్ట్రీ స్పందించకపోవడంతోనే ఫిల్మ్ ఛాంబర్లో ఫిర్యాదు చేశానన్నారు.
News January 18, 2025
అన్నయ్యా.. మీ మాటలు భగవద్గీత శ్లోకాన్ని గుర్తుచేశాయి: తమన్
చిరంజీవి <<15185812>>ప్రశంసలపై<<>> తమన్ స్పందించారు. ‘డియర్ అన్నయ్యా.. మీ మాటలు నాకు కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అన్న భగవద్గీత శ్లోకాన్ని గుర్తుచేశాయి. ఎంత కాదనుకున్నా మనుషులం కదా.. ఒక్కోసారి ఆవేదన గుండె తలుపులు దాటి వచ్చేస్తూ ఉంటుంది. పేగు తెంచుకుని పుట్టిన బిడ్డని, కళ్లు తెరిచే లోపలే చిదిమేస్తుంటే వచ్చిన బాధ అది. అర్థం చేసుకుని మీరు చెప్పిన మాటలు నాకు జీవితాంతం గుర్తుంటాయి’ అని ట్వీట్ చేశారు.
News January 18, 2025
CBIపై బాధితురాలి తండ్రి ఆరోపణలు
కోల్కతా హత్యాచార ఘటనపై CBI దర్యాప్తు పూర్తిగా చేయలేదని బాధితురాలి తండ్రి ఆరోపించారు. ఇందులో ఆరుగురు (నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలు) ఉన్నట్లు DNA రిపోర్టులో వెల్లడైతే సంజయ్ను మాత్రమే నిందితుడిగా చేర్చారని చెప్పారు. తమ కూతురి గొంతుపై గాయాలున్నా ఆ శాంపిల్ సేకరించలేదన్నారు. అటు కేసు పురోగతిని ఎంత అడిగినా చెప్పలేదన్నారు. నేడు కోర్టుకు తమను పిలవలేదని, తమ లాయర్నూ రావద్దని కోరినట్లు తెలిపారు.