News November 27, 2024

BREAKING: రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం

image

గంజాయి విక్రయించే వారి కుటుంబాలకు సంక్షేమ పథకాలు రద్దు చేయాలని AP ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. నార్కోటిక్స్ నియంత్రణపై క్యాబినెట్ సబ్ కమిటీ భేటీలో మంత్రి లోకేశ్ ఈ నిర్ణయం ప్రకటించారు. యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్‌కు ఈగల్‌గా నామకరణం చేశారు. స్కూళ్లు, కాలేజీలు, సచివాలయాల పరిధిలో 10 మందితో ఈగల్ కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వీటిల్లో మహిళా సంఘాలు, ఆశా వర్కర్లను భాగస్వామ్యం చేయాలన్నారు.

Similar News

News January 25, 2026

రాష్ట్రాభివృద్ధిలో ఎంపీల భాగస్వామ్యం కీలకం: సీఎం

image

AP: కేంద్ర బడ్జెట్‌లో ఏపీ ప్రాజెక్టులకు నిధులు సాధించాలని ఎంపీలకు సీఎం చంద్రబాబు సూచించారు. రాష్ట్రాభివృద్ధిలో ఎంపీల భాగస్వామ్యం కీలకంగా ఉండాలన్నారు. ఉత్తరాంధ్ర-రాయలసీమ ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజ్, పూర్వోదయ పథకం, పోలవరం-నల్లమల సాగర్, అమరావతికి చట్టబద్ధతను ప్రాధాన్యతాంశాలుగా తీసుకోవాలని చెప్పారు. కేంద్ర మంత్రులు, అధికారులతో టచ్‌లో ఉండాలని పేర్కొన్నారు. సభలో ప్రతి ఒక్కరూ మాట్లాడాలని సూచించారు.

News January 25, 2026

మూడో టీ20.. భారత్ టార్గెట్ ఎంతంటే?

image

టీమ్ ఇండియాతో మూడో టీ20లో న్యూజిలాండ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. NZ బ్యాటర్లు ఫిలిప్స్(48), చాప్‌మన్(32) ఫర్వాలేదనిపించడంతో మోస్తరు స్కోరు చేసింది. ఓపెనర్ కాన్వే(1), రవీంద్ర(4) విఫలమయ్యారు. భారత బౌలర్లలో బుమ్రా 3, బిష్ణోయ్, హార్దిక్ తలో రెండు, హర్షిత్ రానా ఒక వికెట్ తీశారు. టీమ్ ఇండియా టార్గెట్ 154.

News January 25, 2026

ఇంట్లో అద్దం ఏ వైపున ఉండాలంటే..?

image

అద్దాలు సరైన దిశలో ఉంటేనే ఇల్లు దోషరహితం అవుతుందని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. అద్దాలు తూర్పు, తూర్పు-ఈశాన్యం, ఉత్తర-ఈశాన్యం గోడలకు అమర్చాలని సూచిస్తున్నారు. అలా ఉండటమే శ్రేయస్కరం అంటున్నారు. ‘వీటి వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది. దీర్ఘచతురస్ర, వృత్తాకార అద్దాలు ఉత్తమం. పగిలిన అద్దాలు ఉంచకూడదు. వీటిని ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. అప్పుడే వాస్తు బలం చేకూరుతుంది’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>