News March 9, 2025

BREAKING: ఉత్కంఠ పోరు.. ఆర్సీబీ ఓటమి

image

WPL-2025: ఆర్సీబీతో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచులో యూపీ వారియర్స్‌ విజయం సాధించింది. 226 పరుగులను ఆర్సీబీ ఛేదించలేకపోయింది. 213 పరుగులకు ఆలౌటైంది. దీంతో 12 రన్స్ తేడాతో యూపీ గెలిచింది. ఆఖర్లో ఆర్సీబీ గెలుస్తుందనుకున్నా స్నేహ్ ఔట్ కావడంతో ఆ టీమ్ ఓటమిపాలైంది. ఈ ఓటమితో ఆర్సీబీ WPL నుంచి నిష్క్రమించింది.

Similar News

News February 17, 2026

KMR: మల్లికార్జున ‘మంత్రం’.. మున్సిపల్ పీఠాలపై హస్తం!

image

కామారెడ్డి జిల్లా రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. జిల్లా కాంగ్రెస్ పగ్గాలను ఏలే మల్లికార్జున్ చేపట్టిన తక్కువ కాలంలోనే తనదైన ముద్ర వేశారు. మున్సిపల్ ఎన్నికల రణక్షేత్రంలో వ్యూహకర్తగా వ్యవహరించి జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలను కాంగ్రెస్ ఖాతాలో వేయడంలో కీలక పాత్ర పోషించారు. అసంతృప్త నేతలను బుజ్జగించడం, స్వతంత్రులను కలుపుకుపోవడంలో ఆయన ప్రదర్శించిన చాకచక్యం పార్టీకి ఊపిరిపోసింది.

News February 17, 2026

KMR: మల్లికార్జున ‘మంత్రం’.. మున్సిపల్ పీఠాలపై హస్తం!

image

కామారెడ్డి జిల్లా రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. జిల్లా కాంగ్రెస్ పగ్గాలను ఏలే మల్లికార్జున్ చేపట్టిన తక్కువ కాలంలోనే తనదైన ముద్ర వేశారు. మున్సిపల్ ఎన్నికల రణక్షేత్రంలో వ్యూహకర్తగా వ్యవహరించి జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలను కాంగ్రెస్ ఖాతాలో వేయడంలో కీలక పాత్ర పోషించారు. అసంతృప్త నేతలను బుజ్జగించడం, స్వతంత్రులను కలుపుకుపోవడంలో ఆయన ప్రదర్శించిన చాకచక్యం పార్టీకి ఊపిరిపోసింది.

News February 17, 2026

మెదక్‌లో 25 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పాగా

image

మెదక్ పురపాలక సంఘం పీఠాన్ని 25 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. 2000లో జరిగిన ప్రత్యక్ష ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కొండన్ సావిత్రి సురేందర్ గౌడ్ గెలుపొందిన విషయం తెలిసిందే. తర్వాత జరిగిన 3 ఎన్నికల్లో ఒకసారి టీడీపీ (ఉమ్మడి రాష్ట్రం) 2014, 2020లో బీఆర్ఎస్ పాగా వేసింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో 32 స్థానాలున్న బల్దియాలో 14 గెలుపొందినా కాంగ్రెస్ పీఠం దక్కించుకుంది.