News January 4, 2025
BREAKING: ఢిల్లీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన BJP

ఢిల్లీ ఎన్నికలకు BJP సమర శంఖం పూరించింది. 29 మందితో MLA అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. న్యూఢిల్లీ స్థానంలో అరవింద్ కేజ్రీవాల్పై పర్వేశ్ వర్మ పోటీపడనున్నారు. కాల్కాజీలో CM ఆతిశీని రమేశ్ బిధూరీ ఢీకొంటారు. కరోల్బాగ్ నుంచి దుష్యంత్ గౌతమ్, రాజౌరీ గార్డెన్ నుంచి మజిందర్ సింగ్, బిజ్వాసన్ నుంచి కైలాష్ గహ్లోత్, గాంధీ నగర్ నుంచి అర్విందర్ సింగ్ పోటీ చేస్తున్నారు.
Similar News
News November 23, 2025
బోస్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News November 23, 2025
శ్రీవారి ఆలయంలో పంచబేర వైభవం

తిరుమల శ్రీవారి ఆలయ గర్భగుడిలో 5 ప్రధానమైన మూర్తులు కొలువై ఉన్నాయి. ప్రధానమైనది, స్వయంవ్యక్త మూర్తి అయినది ధ్రువబేరం. నిత్యం భోగాలను పొందే మూర్తి భోగ శ్రీనివాసుడు ‘కౌతుకబేరం’. ఉగ్ర రూపంలో ఉండే స్వామి ఉగ్ర శ్రీనివాసుడు ‘స్నపన బేరం’. రోజువారీ కొలువు కార్యక్రమాలలో పాల్గొనే మూర్తి కొలువు శ్రీనివాసుడు ‘బలిబేరం’. ఉత్సవాల కోసం ఊరేగింపుగా వెళ్లే మూర్తి మలయప్పస్వామి ‘ఉత్సవబేరం’. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News November 23, 2025
రేపు వాయుగుండం.. 48 గంటల్లో తుఫాన్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మలక్కా, సౌత్ అండమాన్ మీదుగా కొనసాగుతోందని APSDMA తెలిపింది. ఇది వాయవ్యదిశగా కదులుతూ రేపటికల్లా వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. అదేవిధంగా కొనసాగుతూ 48 గంటల్లో తుఫాన్గా బలపడే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి డిసెంబర్ 1 వరకు ఏపీలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే పేర్కొన్న సంగతి తెలిసిందే.


