News November 11, 2024
BREAKING: రాంగోపాల్ వర్మపై కేసు

ప్రముఖ డైరెక్టర్ రాంగోపాల్ వర్మపై ప్రకాశం జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. ‘వ్యూహం’ సినిమా సమయంలో చంద్రబాబు, లోకేశ్, బ్రాహ్మణిని కించపరిచేలా పోస్టు పెట్టారని టీడీపీ నేత M.రామలింగం ఫిర్యాదు చేశారు. దీంతో మద్దిపాడు PSలో ఐటీ చట్టం కింద RGVపై కేసు నమోదు చేశారు. కాగా చంద్రబాబు, పవన్, లోకేశ్లపై అనుచిత పోస్టులు పెట్టిన వైసీపీ కార్యకర్తలను ఇప్పటికే అరెస్టులు చేస్తున్న విషయం తెలిసిందే.
Similar News
News November 17, 2025
1,260 ఉద్యోగాలు.. సెలక్షన్ లిస్ట్ విడుదల

TG: 1,260 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల లిస్టును మెడికల్&హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు (MHSRB) విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు 24,045 మంది దరఖాస్తు చేయగా, 23,323 మంది పరీక్ష రాశారు. కాగా స్పోర్ట్స్ కోటా సెలక్షన్ లిస్టును సెపరేట్గా రిలీజ్ చేస్తామని MHSRB వెల్లడించింది. వికలాంగుల కోటాలో దరఖాస్తుదారులు లేకపోవడంతో 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొంది.
ఫలితాల కోసం <
News November 17, 2025
షేక్ హసీనాను దోషిగా తేల్చిన కోర్టు

బంగ్లాదేశ్ మాజీ PM షేక్ హసీనాను ఆ దేశ ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్(ICT) దోషిగా తేల్చింది. గతేడాది విద్యార్థుల ఆందోళనలను హింసాత్మకంగా అణచివేశారని, 1400 మంది చావుకు కారణమయ్యారని ఆమెతో పాటు మరో ఇద్దరిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వాటిని విచారించిన ICT ఆధారాలను నిజమైనవిగా పరిగణించి దోషిగా తేల్చింది. ఆమెకు గరిష్ఠశిక్ష పడుతుందని పేర్కొంది. ఇవి తప్పుడు ఆరోపణలని, తీర్పును పట్టించుకోనని హసీనా అన్నారు.
News November 17, 2025
HYDలో పెరుగుతున్న విడాకుల కేసులు!

యువత చిన్న సమస్యలు, గొడవలకే విడాకులు తీసుకుంటోంది. ఈ కల్చర్ హైదరాబాద్లో పెరుగుతోంది. ఫ్యామిలీ కోర్టుల్లో ప్రతినెలా సుమారు 250 విడాకుల కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. 25 – 35 ఏళ్ల మధ్య ఉన్న జంటలు చిన్న కారణాలకే డివోర్స్ తీసుకుంటున్నట్లు సమాచారం. యువ జంటలు సహనం, సర్దుబాటు, కమ్యూనికేషన్కు ప్రాధాన్యత ఇచ్చి చిన్న సమస్యలకే కోర్టు మెట్లెక్కకుండా వివాహ బంధాన్ని కాపాడుకోవాలని నిపుణులు కోరుతున్నారు.


