News March 22, 2024
BREAKING: పరీక్షల తేదీల మార్పు
TG: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో ఎంట్రన్స్ పరీక్షల తేదీల్లో అధికారులు మార్పులు చేశారు. EAPCET (పాత ఎంసెట్) అగ్రి అండ్ ఫార్మా పరీక్షను మే 7, 8 తేదీల్లో నిర్వహిస్తామని చెప్పారు. మే 9, 10, 11 తేదీల్లో ఈఏపీసెట్ ఇంజినీరింగ్ ఎగ్జామ్ ఉంటుందని తెలిపారు. ఐసెట్ పరీక్ష తేదీలను జూన్ 5, 6 తేదీలకు మార్చామన్నారు.
Similar News
News October 2, 2024
స్త్రీ శక్తిని నమ్మిన బాపూజీ
మహాత్మా గాంధీ దేశ స్వాతంత్ర్య పోరాటంలో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించారు. సహాయ నిరాకరణ, మద్యపాన నిషేధ బాధ్యతలను మహిళలకే అప్పగించారు. లింగభేదాన్ని బాపూ తీవ్రంగా వ్యతిరేకించేవారు. మహిళలను బలహీనవర్గంగా పరిగణించడమంటే వాళ్లను అవమానించినట్లేనని చెప్పేవారు. సీత, ద్రౌపది, దమయంతి లాంటి పురాణ స్త్రీల గురించి ఎక్కువగా ప్రస్తావించేవారు.
News October 2, 2024
రజినీకాంత్ ఆరోగ్యంపై ప్రధాని మోదీ ఆరా!
ఆస్పత్రిలో చేరిన సూపర్ స్టార్ రజినీకాంత్ ఆరోగ్యం గురించి ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. లతా రజినీకాంత్కి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నట్లు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై తెలిపారు. ‘శస్త్రచికిత్స జరిగిందని, క్షేమంగా ఉన్నారని చెప్పారు. తలైవా త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు’ అని పేర్కొన్నారు.
News October 2, 2024
పెన్షన్లు తీసుకునేవారికి గమనిక
AP: ఈరోజు పబ్లిక్ హాలిడే కావడంతో పెన్షన్ల పంపిణీకి బ్రేక్ పడనుంది. తొలిరోజైన నిన్న రాత్రి 8 గంటల వరకు 97.65 శాతం పంపిణీ పూర్తయింది. 64.38 లక్షల మందికి గాను 62.90 లక్షల మందికి పెన్షన్లు అందజేశారు. 1వ తేదీ పబ్లిక్ హాలిడే/ఆదివారం వస్తే ఆ ముందు రోజు, 2న హాలిడే/ఆదివారం వస్తే ఆ తర్వాతి రోజు పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం గురువారం పెన్షన్లు పంపిణీ చేయనున్నారు.