News February 10, 2025
BREAKING: అకౌంట్లో డబ్బుల జమ

తెలంగాణలోని రైతులకు శుభవార్త. 2 ఎకరాల వరకు రైతు భరోసా నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఒక్కొక్కరికి రూ.6వేల చొప్పున మొత్తం 8.65 లక్షల మంది ఖాతాల్లో రూ.707.54 కోట్లు జమ చేసింది. కాగా ఇప్పటికే ఎకరం పొలం ఉన్న 17 లక్షల మంది రైతులకు రూ.557 కోట్లు, 557 పైలట్ గ్రామాలకు చెందిన వారికి రూ.568 కోట్లు జమ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు మొత్తం 30.11 లక్షల మంది రైతులకు రూ.1834.09కోట్లు జమ అయ్యాయి.
Similar News
News January 7, 2026
‘జన నాయకుడు’ విడుదలపై వీడని ఉత్కంఠ

విజయ్ ‘జన నాయకుడు’ సినిమా విడుదలకు గండం తప్పేలా లేదు. సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలంటూ నిర్మాతలు మద్రాస్ హైకోర్టుకు వెళ్లగా తీర్పు రిజర్వ్ చేసింది. ఈనెల 9న సినిమా విడుదల కావాల్సి ఉండగా అదే రోజు తీర్పు చెప్పే అవకాశం ఉందని న్యాయస్థానం పేర్కొంది. దీంతో సినిమా విడుదల టెక్నికల్గా వాయిదా పడినట్టేనని తెలుస్తోంది.
News January 7, 2026
అబార్షన్ అయిందా..? ఈ జాగ్రత్తలు తీసుకోండి

వివిధ కారణాల వల్ల కొన్నిసార్లు అబార్షన్ కావొచ్చు. దీని తర్వాత ఆ మహిళ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. డాక్టర్లు సూచించిన మందులు వాడాలి. రెండు వారాలకు మీరు మామూలుగా ఇంటి పనులు, వ్యాయామం, యోగా మొదలుపెట్టవచ్చు. అయితే అబార్షన్ తర్వాత నెలసరి అస్తవ్యస్తం అయ్యే అవకాశం ఉంది. 3నెలలపాటు మల్టీవిటమిన్ మాత్రలు తీసుకోవాలి. మానసికంగా, శారీరకంగా పూర్తిగా కోలుకున్న తరువాతే ప్రెగ్నెన్సీ గురించి ఆలోచించాలి.
News January 7, 2026
NPCILలో 114 పోస్టులకు షార్ట్ నోటిఫికేషన్

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCIL) 114 పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సైంటిఫిక్ అసిస్టెంట్, స్టైపెండరీ ట్రైనీ/సైంటిఫిక్ అసిస్టెంట్, స్టైపెండరీ ట్రైనీ/టెక్నీషియన్, X-RAY టెక్నీషియన్, అసిస్టెంట్ గ్రేడ్-1 పోస్టులు ఉన్నాయి. అర్హతగల వారు JAN 15 నుంచి ఫిబ్రవరి 4 వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. www.npcilcareers.co.in


