News June 3, 2024
BREAKING: సోషల్ మీడియాలో బెదిరింపులపై డీజీపీ వార్నింగ్

AP: కౌంటింగ్ తర్వాత ప్రత్యర్థుల అంతుచూస్తామంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని DGP హరీశ్ గుప్తా హెచ్చరించారు. వ్యక్తిగత దూషణలతో పోస్టులు, ఫొటోలు, వీడియోలను షేర్ చేయడం, వాట్సాప్ స్టేటస్గా పెట్టుకోవడం కూడా నిషిద్ధమన్నారు. ‘అలాంటి వ్యక్తులపై IT యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తాం. రౌడీ షీట్లు ఓపెన్ చేసి, PD యాక్ట్ ప్రయోగిస్తాం’ అని వార్నింగ్ ఇచ్చారు.
Similar News
News November 25, 2025
అనంతపురం: దాడి కేసులో ఏడుగురి అరెస్ట్

అనంతపురం నగరం సాయి నగర్ 3rd క్రాస్లోని శ్రీనివాస మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్పై దాడిచేసి ధ్వంసం చేసిన ఘటనలో అడ్వకేట్ మొగలి సత్యనారాయణరెడ్డితోపాటు ఏడుగురుని అరెస్టు చేసినట్లు 2 టౌన్ సీఐ శ్రీకాంత్ తెలిపారు. నిందితులను 14 రోజుల రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించామని పేర్కొన్నారు. దాడికి ఉపయోగించిన మూడు కార్లు, బైక్, మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వివరించారు.
News November 25, 2025
నగదు విరాళాలపై కేంద్రం, ఈసీలకు సుప్రీం నోటీసులు

రాజకీయ పార్టీలకు గుర్తుతెలియని వ్యక్తులు ఇచ్చే రూ.2 వేల లోపు నగదు విరాళాలకు ఐటీ మినహాయింపును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారించింది. నగదు రూపంలో విరాళాలు తీసుకుంటే ఎన్నికల గుర్తు కేటాయించబోమని, పొలిటికల్ పార్టీగా నమోదు చేయబోమని షరతులు విధించేలా ఈసీకి ఆదేశాలివ్వాలని పిటిషన్లో కోరారు. దీనిపై అభిప్రాయం చెప్పాలని కేంద్రం, ఈసీతోపాటు రాజకీయ పార్టీలకు సుప్రీం నోటీసులిచ్చింది.
News November 25, 2025
GAIL (INDIA) లిమిటెడ్లో ఉద్యోగాలు

<


