News January 28, 2025
BREAKING: ఘోర ప్రమాదాలు.. ఐదుగురు దుర్మరణం

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ ఉదయం రెండు ఘోర ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. HYD రాజేంద్రనగర్ పరిధిలో ఆరాంఘర్ ఫ్లైఓవర్పై డివైడర్ను బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఇక ఏపీలోని నంద్యాల చాపిరేవులలో ఓ ఇంట్లో వంట చేస్తుండగా సిలిండర్ పేలింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Similar News
News February 14, 2025
వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్

AP: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి విజయవాడ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కాసేపట్లో ఆయనను పోలీసులు విజయవాడ జిల్లా జైలుకు తరలించనున్నారు. నిన్న ఉదయం ఆయనను అరెస్ట్ చేసిన పోలీసులు 8 గంటల పాటు విచారించారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి జడ్జి ముందు హాజరుపరిచారు. దాదాపు 2 గంటలపాటు వాదనలు జరిగాయి. A1 వంశీతో పాటు A7 శివరామకృష్ణ, A8 లక్ష్మీపతికి న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు.
News February 14, 2025
వంశీ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు

AP: వల్లభనేని <<15453734>>వంశీకి<<>> నేర చరిత్ర ఉందని, అతనిపై ఇప్పటివరకు 16 క్రిమినల్ కేసులు ఉన్నట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. టీడీపీ ఆఫీసుపై దాడి కేసును విత్ డ్రా చేసుకోవాలని వంశీ, అతని అనుచరులు సత్యవర్ధన్ను బెదిరించారని తెలిపారు. సత్యవర్ధన్ సోదరుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేశామన్నారు. వంశీకి బెయిల్ ఇవ్వొద్దని, రిమాండ్ విధించాలని కోరారు. ఈ కేసులో మరికొంత మంది నిందితులు దొరకాల్సి ఉందన్నారు.
News February 14, 2025
రెసిప్రోకల్ సుంకాలను వసూలు చేస్తాం: ట్రంప్

ఇతర దేశాల నుంచి రెసిప్రోకల్ (పరస్పర) సుంకాలను వసూలు చేయాలని నిర్ణయించినట్లు యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. US నుంచి ఆయా దేశాలు ఎంత వసూలు చేస్తే తామూ అంతే వసూలు చేస్తామని వెల్లడించారు. ఇతర దేశాలతో పోలిస్తే భారత్ ఎక్కువ టారిఫ్స్ వసూలు చేస్తోందని తెలిపారు. తాము కూడా భారత్ నుంచి అంతే వసూలు చేస్తున్నామని చెప్పారు.