News August 17, 2024

BREAKING: పోలవరం కార్యాలయంలో ఫైళ్లు దగ్ధం

image

AP: ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు పరిపాలనా కార్యాలయంలో పలు ఫైళ్లు దగ్ధం అయ్యాయి. ఎడమ కాలువ భూసేకరణకు సంబంధించిన దస్త్రాలు ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. లబ్ధిదారుల పరిహారంలో అక్రమాలు బయటకు వస్తాయనే వీటిని కాల్చినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనలో పలువురు అధికారుల పాత్ర ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వేదవల్లి దీనిపై విచారిస్తున్నారు.

Similar News

News December 4, 2025

పొరపాటున కూడా వీటిని ఫ్రిజ్‌లో పెట్టకండి!

image

అధిక కాలం తాజాగా ఉంచడానికి చాలామంది ప్రతీ వస్తువును ఫ్రిజ్‌లో పెడుతుంటారు. అయితే కొన్ని ఆహార పదార్థాలు ఫ్రిజ్‌లో పెట్టకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పొరపాటున కూడా ఫ్రిజ్‌లో పెట్టకూడని ఆహారాలు.. డ్రై ఫ్రూట్స్, సుగంధ ద్రవ్యాలు, కాఫీ, నూనెలు, కుంకుమ పువ్వు, బ్రెడ్, క్యారెట్, అల్లం, ముల్లంగి, బంగాళదుంపలు. ఒకవేళ తప్పకుండా ఫ్రిజ్‌లోనే పెట్టాలి అనుకుంటే గాజు జార్‌లో ఉంచడం బెస్ట్.

News December 4, 2025

ఎయిడ్స్ నియంత్రణలో APకి ఫస్ట్ ర్యాంక్

image

AP: HIV నియంత్రణ, బాధితులకు వైద్యసేవలందించడంలో AP దేశంలో తొలి స్థానంలో నిలిచిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. నిర్దేశిత 138 ప్రమాణాల్లో 105లో ఉత్తమ పనితీరు కనబరిచిందన్నారు. న్యాక్ త్రైమాసిక నివేదికలో రాష్ట్రం 2వ స్థానంలో ఉండగా అర్ధసంవత్సర ర్యాంకుల్లో ప్రథమ స్థానం సాధించినట్లు వివరించారు. ఇతర రాష్ట్రాల కన్నా ఉత్తమ పనితీరు కనబరిచిన ఎయిడ్స్ నియంత్రణ సంస్థ అధికారులు, సిబ్బందిని అభినందించారు.

News December 4, 2025

PHOTO: 25 ఏళ్ల క్రితం పుతిన్‌తో మోదీ

image

రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటన వేళ 25 ఏళ్ల క్రితంనాటి ఓ ఫొటో వైరలవుతోంది. 2001లో అప్పటి ప్రధాని వాజ్‌పేయితో కలిసి గుజరాత్ సీఎం హోదాలో మోదీ మాస్కో పర్యటనకు వెళ్లారు. రెండు దేశాల అగ్రనేతల భేటీ సమయంలో.. అక్కడ మోదీ కూడా ఉన్న ఫొటో తాజాగా బయటకొచ్చింది. దీనిని చూస్తూ.. మోదీ, పుతిన్‌ల మధ్య ఉన్న స్నేహబంధం దాదాపు 25 ఏళ్ల నాటిదని నెటిజన్లు కొనియాడుతున్నారు. ఈ బంధం ఇలాగే కొనసాగాలని కోరుతున్నారు.