News October 27, 2024
BREAKING: కదులుతున్న రైలులో మంటలు!
మధ్యప్రదేశ్లో కదులుతున్న రైలులో మంటలు అలజడి సృష్టించాయి. ఒక్కసారిగా భయాందోళనకు గురైన ప్రయాణికులు రైలు నుంచి దూకారు. ఈ ఘటన రత్లాం సమీపంలోని ప్రీతమ్ నగర్, రునియా రైల్వే స్టేషన్ మధ్య చోటు చేసుకుంది. దీంతో వెంటనే రైలును నిలిపివేశారు. ప్రయాణికులు ఒక్కసారిగా బయటకు రావడంతో తొక్కిసలాట చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News October 27, 2024
కేసులకు భయపడం: కేటీఆర్
TG: తమను రాజకీయంగా ఎదుర్కోలేక కుటుంబసభ్యులు, బంధువుల మీద కేసులు బనాయిస్తున్నారని కేటీఆర్ అన్నారు. 11 నెలలుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెప్పారు. ఉద్యమ స్ఫూర్తితో తాము కేసులకు భయపడబోమని, ప్రభుత్వంపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఆరు గ్యారంటీలపై ప్రభుత్వం తరఫున ఒక్కరూ మాట్లాడట్లేదని విమర్శించారు.
News October 27, 2024
భారత్ ఓటమి
న్యూజిలాండ్తో జరిగిన రెండో వన్డేలో భారత మహిళల జట్టు 76 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ డివైన్(79), సుజీ బేట్స్(58) రాణించడంతో 259 పరుగులు చేసింది. ఛేదనలో భారత్ టాపార్డర్ విఫలమవ్వడంతో 183 పరుగులకే ఆలౌటైంది. జట్టులో రాధా యాదవ్(48) టాప్ స్కోరర్. NZ విజయంతో సిరీస్ సమమైంది. కాగా సిరీస్ విజేతను నిర్ధారించే మూడో వన్డే 29న జరగనుంది.
News October 27, 2024
సంచలనంగా జన్వాడ ఫాంహౌస్ పార్టీ!
తెలంగాణ రాజకీయాల్లో జన్వాడ ఫాంహౌస్ పార్టీ సంచలనంగా మారింది. KTR బావమరిది పాకాల రాజ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. పార్టీలో పాల్గొన్న ఓ వ్యక్తి డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు KTRను టార్గెట్ చేస్తున్నాయి. అయితే ఫాంహౌస్లో డ్రగ్స్ లభించలేదని, పర్మిషన్ లేని లిక్కర్ వాడినంత మాత్రాన కేసులేంటని BRS కార్యకర్తలు కౌంటర్ ఇస్తున్నారు. ఇది రేవ్ పార్టీ కాదు ఫ్యామిలీ పార్టీ అంటున్నారు.