News February 4, 2025

BREAKING: భారీగా పెరిగిన బంగారం ధరలు

image

పెళ్లిళ్ల సీజన్ వేళ పసిడి ధరలు భయపెడుతున్నాయి. ఇవాళ హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,050 పెరిగి రూ.78,100లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,150 పెరగడంతో రూ.85,200 పలుకుతోంది. ఇక కేజీ సిల్వర్ రేటు రూ.1,000 తగ్గి రూ.1,06,000లకు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.

Similar News

News February 18, 2025

27న ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సెలవు

image

AP: గ్రాడ్యుయేట్, టీచర్ MLC ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఓటర్లుగా ఉన్న GOVT ఉద్యోగులకు ఈ నెల 27న స్పెషల్ క్యాజువల్ లీవ్ ఉండనుంది. ఉమ్మడి కృష్ణా-గుంటూరు, ఉ.గోదావరి పట్టభద్రులు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ ఉపాధ్యాయ నియోజకవర్గాల్లోని వారికి ఈ సెలవు వర్తిస్తుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ ఆదేశాలిచ్చారు. ప్రైవేటు ఉద్యోగులు కూడా ఓటు వేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.

News February 18, 2025

నేడు శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల విడుదల

image

AP: మే నెలకు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను TTD ఈరోజు ఉదయం 10 గం.కు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవలకు సంబంధించి నేటి నుంచి ఈ నెల 20వ తేదీ ఉదయం 10గంటల వరకు ఆన్‌లైన్లో భక్తులు రిజిస్టర్ చేసుకోవచ్చు. వాటి చెల్లింపుల్ని ఈ నెల 20 నుంచి 22వ తేదీల మధ్యలో చేయాల్సి ఉంటుంది. మే నెల గదుల కోటాను టీటీడీ ఈ నెల 24న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనుంది.

News February 18, 2025

నేడు రాజస్థాన్‌కు మంత్రి సీతక్క

image

TG: రాష్ట్ర గ్రామీణాభివృద్ధి మంత్రి సీతక్క నేడు రాజస్థాన్‌కు వెళ్లనున్నారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అక్కడ నిర్వహిస్తున్న వాటర్ విజన్-2047 సదస్సులో ఆమె పాల్గొంటారు. తెలంగాణలో గ్రామీణ మంచినీటి సరఫరా గురించి మంత్రి ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా రక్షిత మంచినీటి విషయంలో ఆర్థిక సహకారం అందించాలని కేంద్రాన్ని కోరనున్నారు.

error: Content is protected !!