News November 30, 2024

గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం

image

ఖాతాదారులకు EPFO సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ శుభవార్త చెప్పింది. ఇకపై క్లెయిమ్ సెటిల్‌మెంట్ చేసే తేదీ వరకూ చందాదారుడికి వడ్డీ చెల్లించాలని నిర్ణయించింది. ప్రస్తుతం సెటిల్‌మెంట్ చేసే నెల 24వ తేదీ వరకు మాత్రమే వడ్డీ లెక్కించే విధానం అమల్లో ఉంది. దీంతో ఖాతాదారుడికి ఆర్థికంగా నష్టం జరుగుతోందన్న ఫిర్యాదులు రావడంతో ఇవాళ్టి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది.

Similar News

News January 25, 2026

అమరావతికి చట్టబద్ధతే లక్ష్యం.. ఎంపీలకు సీఎం దిశానిర్దేశం

image

AP: కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై టీడీపీ ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అమరావతికి చట్టబద్ధత బిల్లు, పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు, పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన నిధులను సాధించడంపై సూచనలు చేశారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, రామ్మోహన్, రాష్ట్ర మంత్రి లోకేశ్ కూడా పాల్గొన్నారు.

News January 25, 2026

APPLY NOW: టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు

image

<>కొచ్చిన్ <<>>యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 3 టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ 3 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. MSc కెమిస్ట్రీ, కెమికల్ ల్యాబ్‌లో పని అనుభవం గలవారు ఫిబ్రవరి 13 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీని ఫిబ్రవరి 20 వరకు పంపాలి. వయసు 18-36ఏళ్ల మధ్య ఉండాలి. నెలకు రూ.41,970 చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.900, SC,ST అభ్యర్థులకు రూ.185. వెబ్‌సైట్: https://recruit.cusat.ac.in

News January 25, 2026

తేజస్వీ యాదవ్‌కు ఆర్జేడీ పగ్గాలు

image

రాష్ట్రీయ జనతాదళ్‌(RJD) నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తేజస్వీ యాదవ్‌ నియమితులయ్యారు. పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఇటీవల జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత యువ నాయకత్వానికి బాధ్యతలు అప్పగించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మాజీ డిప్యూటీ సీఎంగా అనుభవం ఉన్న తేజస్వి ఇకపై పార్టీ పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషించనున్నారు.