News January 31, 2025
BREAKING: అండర్-19 WC ఫైనల్లో భారత్

అండర్-19 W T20 వరల్డ్ కప్ ఫైనల్కు భారత్ దూసుకెళ్లింది. సెమీస్లో ఇంగ్లండ్ను 9 వికెట్లతో చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ENG 20 ఓవర్లలో 113 రన్స్ చేసింది. ఛేజింగ్లో భారత ఓపెనర్ కమలిని హాఫ్ సెంచరీతో చెలరేగారు. 50 బంతుల్లో 56 రన్స్తో నాటౌట్గా నిలిచారు. తెలుగమ్మాయి గొంగడి త్రిష 35, సానిక 11*తో రాణించారు. దీంతో IND 15 ఓవర్లలో టార్గెట్ను ఛేదించి ఎల్లుండి సౌతాఫ్రికాతో తుది పోరుకు సిద్ధమైంది.
Similar News
News December 3, 2025
సమంత-రాజ్.. కొత్త ఫొటోలు చూశారా?

హీరోయిన్ సమంత, డైరెక్టర్ రాజ్ నిడిమోరు వివాహ బంధంలోకి అడుగుపెట్టడం హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. సమంత మెహిందీ వేడుకకు సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. ఆమె నవ్వుతూ చేతులు చూపిస్తుండగా, రాజ్ ఫొటోలు తీశారు. సమంత క్లోజ్ ఫ్రెండ్ ఒకరు వీటిని SMలో పోస్ట్ చేశారు. ‘సమంత.. ఈ పెళ్లితో నీలో కొత్త రకమైన సంతోషాన్ని చూస్తున్నా. మీరిద్దరూ ఇలాగే కలకాలం కలిసుండాలి’ అని పేర్కొన్నారు.
News December 3, 2025
DCM అంటే దిష్టి చుక్క మంత్రి.. పవన్పై YCP సెటైర్లు

AP: కోనసీమ దిష్టి వివాదం నేపథ్యంలో Dy.CM పవన్ కళ్యాణ్పై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. పొద్దున లేస్తే హైదరాబాద్లోనే ఉండే ఆయన తెలంగాణ ప్రజలను కించపరిచేలా మాట్లాడటం సరికాదని హితవు పలుకుతున్నారు. అప్పుడప్పుడు ఏపీకి వచ్చే ఆయన ఇటీవల కోనసీమలో వెకేషన్ కోసం పర్యటించారని సెటైర్లు వేస్తున్నారు. డిప్యూటీ సీఎం(DCM) అంటే దిష్టి చుక్క మంత్రి అంటూ ఎద్దేవా చేస్తున్నారు.
News December 3, 2025
పడింది ఒకే బాల్.. వచ్చింది 10 రన్స్

IND-RSA మధ్య జరుగుతున్న రెండో వన్డేలో ఆసక్తికర ఘటన జరిగింది. ప్రసిద్ధ్ వేసిన 37వ ఓవర్ తొలి బంతికి బ్రేవిస్ సిక్స్ కొట్టారు. తర్వాతి బంతి వైడ్ కాగా అనంతరం నో బాల్ ప్లస్ 2 రన్స్ వచ్చాయి. దీంతో ఒకే బాల్ కౌంట్ అవగా 10 రన్స్ స్కోర్ బోర్డుపై చేరాయి. అటు మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. ప్రస్తుతం సౌతాఫ్రికా స్కోర్ 42 ఓవర్లకు 299/4. ఆ జట్టు విజయానికి 60 రన్స్, IND గెలుపునకు 6 వికెట్లు కావాలి.


