News March 19, 2024
BREAKING: భారీ ఎన్కౌంటర్.. నలుగురు మావోల మృతి

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఇవాళ భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల కాల్పుల్లో నలుగురు మావోయిస్టు అగ్రనేతలు మరణించారు. మృతుల్లో డీవీసీ సభ్యులు వర్గీష్, మంగాతు, ప్లాటూన్ సభ్యులు కురసం రాజు, వెంకటేశ్ ఉన్నారు. వీరంతా తెలంగాణ రాష్ట్ర కమిటీకి చెందిన వారు. వీరిపై రూ.36 లక్షల రివార్డు ఉంది. సంఘటనా స్థలంలో భారీగా పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Similar News
News January 15, 2026
వచ్చే నెలలో సూర్యగ్రహణం.. భారత్లో నో ఎఫెక్ట్!

వచ్చే నెల 17(మంగళవారం)న సూర్యగ్రహణం సంభవించనుంది. దీనిని ‘రింగ్ ఆఫ్ ఫైర్’గా పేర్కొంటున్నారు. భారత కాలమాన ప్రకారం సా.5.11 గంటలకు ఈ గ్రహణం ఏర్పడనుంది. అయితే ఇది మనదగ్గర కనిపించదు. అంటార్కిటికా, ఆఫ్రికాలోని కొన్ని దేశాలు, ఆస్ట్రేలియా, హిందూ మహాసముద్ర తీర ప్రాంతాల్లో చూడవచ్చు. మన దేశంలో కనిపించే అవకాశం లేకపోవడంతో ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదని పండితులు చెబుతున్నారు.
News January 15, 2026
ఎయిర్ఫోర్స్ స్కూల్ హిండెన్లో ఉద్యోగాలు

ఘజియాబాద్లోని <
News January 15, 2026
మనోళ్లదే డామినేషన్.. ఆధార్ కార్డు vs గ్రీన్ కార్డు!

అండర్-19 WCలో INDతో ఆడుతున్న అమెరికా జట్టులోని ప్లేయర్లందరూ భారత మూలాలు ఉన్నవారే కావడం విశేషం. ఉత్కర్ష్ శ్రీవాస్తవ(C), అద్నిత్, నితీశ్, అర్జున్ మహేశ్, అమరీందర్, సబ్రిశ్, అదిత్, అమోఘ్, సాహిల్, రిషబ్, రిత్విక్ పూర్వీకులు ఇండియా నుంచి వెళ్లారు. దీంతో మనోళ్ల డామినేషన్ మామూలుగా లేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇది IND vs USA కాదని.. ఆధార్ కార్డు vs గ్రీన్ కార్డు అని జోకులు పేలుస్తున్నారు.


