News March 19, 2024

BREAKING: భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు మావోల మృతి

image

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఇవాళ భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల కాల్పుల్లో నలుగురు మావోయిస్టు అగ్రనేతలు మరణించారు. మృతుల్లో డీవీసీ సభ్యులు వర్గీష్, మంగాతు, ప్లాటూన్ సభ్యులు కురసం రాజు, వెంకటేశ్ ఉన్నారు. వీరంతా తెలంగాణ రాష్ట్ర కమిటీకి చెందిన వారు. వీరిపై రూ.36 లక్షల రివార్డు ఉంది. సంఘటనా స్థలంలో భారీగా పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Similar News

News September 7, 2025

ఉపరాష్ట్రపతి ఎన్నిక..‘ఇండీ’ ఎంపీలకు మాక్ పోలింగ్

image

ఈ నెల 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనున్న క్రమంలో రేపు పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ఇండీ కూటమి ఎంపీలకు మాక్ పోలింగ్ నిర్వహిస్తున్నట్లు ఎంపీ మల్లు రవి తెలిపారు. గత ఎన్నికల్లో 15 మంది ఎంపీలు సరిగ్గా ఓటు హక్కు వినియోగించుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించడం ఎంపీల బాధ్యత అని, ఈ ఎన్నికల్లో ఆత్మప్రబోధానుసారం ఓటు వేయాలని సూచించారు.

News September 7, 2025

రూ.50 లక్షలకు కేజీ డ్రగ్స్.. సంచలన విషయాలు వెలుగులోకి

image

TG: డ్రగ్స్ తయారీ యూనిట్ <<17630840>>కేసులో<<>> సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ డ్రగ్స్‌ను కేజీ రూ.50 లక్షల చొప్పున విజయ్ ఓలేటి అనే వ్యక్తి హైదరాబాద్‌లో అమ్మినట్లు గుర్తించారు. ప్రత్యేకంగా గ్యాంగ్‌ను ఏర్పాటు చేసుకొని దందా చేశారని అధికారులు వెల్లడించారు. దీంతో రూ.వందల కోట్లు సంపాదించినట్లు తెలిపారు. ముంబై నార్కోటిక్ పోలీసుల్లో ఒకరు కార్మికుడిగా చేరి పక్కాగా వివరాలు సేకరించారన్నారు.

News September 7, 2025

క్యాన్సర్ వ్యాక్సిన్ కనుగొన్నాం: రష్యా

image

Enteromix అనే క్యాన్సర్ వ్యాక్సిన్ కనుగొన్నట్లు రష్యా ప్రకటించింది. ఇది ట్యూమర్లను కరిగించి వాటిని నాశనం చేస్తుందని తెలిపింది. లంగ్స్, బ్రెస్ట్, పెద్దపేగు తదితర క్యాన్సర్లకు చెక్ పెడుతుందని చెప్పింది. ఫెడరల్ మెడికల్ అండ్ బయోలాజికల్ ఏజెన్సీ దీన్ని అభివృద్ధి చేయగా, క్లినికల్ ట్రయల్స్‌లో 100% ఫలితాలొచ్చినట్లు వెల్లడించింది. దీని వినియోగానికి ఆరోగ్యశాఖ తుది అనుమతుల కోసం వేచి చూస్తున్నట్లు పేర్కొంది.