News May 11, 2024

BREAKING: మే 14న వారికి సెలవు

image

AP: మే 13న జరిగే ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి మే 14న ప్రత్యేక క్యాజువల్ లీవ్ కల్పిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా వెల్లడించారు. ‘ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, ఇతర పోలింగ్ సిబ్బందికి ఈ సెలవు వర్తిస్తుంది. విధులకు హాజరైన రిజర్వ్‌డ్, డ్రాఫ్ట్ చేయబడిన సిబ్బందికి ఈ సెలవు వర్తించదు. కలెక్టర్లు ఈ ఆదేశాలు అమలు చేయాలి’ అని ఆయన ఆదేశించారు.

Similar News

News December 11, 2025

14,967 ప్రభుత్వ ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఇవాళే లాస్ట్

image

జవహర్ నవోదయ, కేంద్రీయ విద్యాలయాల్లో 14,967 ఉద్యోగాలకు దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. 13,025 టీచింగ్, 1,942 నాన్ టీచింగ్ పోస్టులున్నాయి. పోస్టును బట్టి PG, డిగ్రీ, B.Ed, M.Ed, MCA, M.PEd, CTET, ఇంటర్, డిప్లొమా పాసైనవారు అర్హులు. CBT, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఓసారి గడువు పొడిగించినందున మరోసారి అవకాశం ఉండకపోవచ్చు.
వెబ్‌సైట్: https://examinationservices.nic.in/

News December 11, 2025

చలికాలం.. పశువులు, కోళ్ల పెంపకంలో జాగ్రత్తలు

image

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. ఈ సమయంలో కోళ్లు, పాడి పశువులకు శ్వాస సంబంధిత వ్యాధుల ముప్పు ఎక్కువ. అందుకే కోళ్లు, పశువుల ప్రవర్తనను గమనించాలి. పోషకాలతో కూడిన మేత, దాణా, మంచి నీటిని వాటికి అందించాలి. అవసరమైన టీకాలు వేయించాలి. పశువుల కొట్టాలు, కోళ్ల ఫారమ్ చుట్టూ పరదాలు కట్టాలి. ఈ సమయంలో పాడి, కోళ్ల పెంపకంలో తీసుకోవాల్సిన మరిన్ని జాగ్రత్తల గురించి తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.

News December 11, 2025

BREAKING: పోలింగ్ ప్రారంభం

image

TG: రాష్ట్రంలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 37,562 కేంద్రాల్లో 56.19 లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 3,834 సర్పంచ్ స్థానాల్లో 12,960 మంది, 27,628 వార్డుల్లో 65,455 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు తేల్చనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కొనసాగనుంది. 2PM నుంచి ఓట్లు లెక్కించి విజేతలను ప్రకటిస్తారు. ఇవాళే ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఉంటుంది.