News May 1, 2024
BREAKING: వారికి 50 ఏళ్లకే పింఛన్: చంద్రబాబు

AP: గుంటూరు ప్రజాగళం సభలో టీడీపీ చీఫ్ చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. ముస్లింలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని ప్రకటించారు. హజ్ యాత్రకు వెళ్లేవారికి రూ.లక్ష, మైనార్టీ కార్పొరేషన్ ద్వారా రూ.5లక్షలు వడ్డీలేని రుణాలు అందజేస్తామని స్పష్టం చేశారు. నూర్ బాషాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.100 కోట్ల ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు. ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లు కొనసాగేలా కృషి చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
Similar News
News January 31, 2026
కశ్మీర్లో ఉగ్రవాదులతో భీకర పోరు

JKలోని కిష్తవార్ జిల్లా దోల్గాంలో శనివారం తెల్లవారుజామున భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య భారీ ఎన్కౌంటర్ మొదలైంది. జనవరి 18న మొదలైన ఆపరేషన్ త్రాషి-Iలో భాగంగా భారత ఆర్మీ, JK పోలీసులు, CRPF సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో అక్కడే నక్కిన ముగ్గురు జైషే ఉగ్రవాదులు బలగాలకు తారసపడ్డారు. వారు కాల్పులు జరపటంతో.. బలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి.
News January 31, 2026
నేటితో ముగియనున్న ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు

AP: రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 19 నుంచి ప్రారంభమైన ఉచిత పశు ఆరోగ్య శిబిరాల కార్యక్రమం నేటితో ముగియనుంది. 13,257 గ్రామాల్లో శిబిరాలను ఏర్పాటు చేసి పశు వైద్య చికిత్సలు, నట్టల నివారణ మందులు, వ్యాధి నిరోధక టీకాలను అందించడం, వ్యాధి నిర్ధారణ పరీక్షలను నిర్వహిస్తున్నారు. పాడిరైతులకు పశు యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికీ పశువులకు టీకాలు వేయించకుంటే ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి.
News January 31, 2026
ధనవంతులు కావాలంటే..?

ధనవంతులు కావాలనే తపన అందరిలో ఉంటుంది. కానీ అందుకు అదృష్టం కూడా తోడవాలి. ఆధ్యాత్మికంగా ధనాకర్షణ పెరగాలంటే తోటివారికి సాయం చేయడం, దానం చేయడం ఉత్తమం. పర్సులో ఎప్పుడూ కొంత నగదు ఉంచుకోవడం, దగ్గర డబ్బులు పెట్టడం వల్ల సంపద శక్తి పెరుగుతుంది. సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల సానుకూలత లభిస్తుంది. అయితే, ఈ మార్గాలన్నీ ఇంజిన్కు పెట్రోల్ వంటివి మాత్రమే. లక్ష్యాన్ని చేరడానికి మీ నిరంతర కృషే అసలైన వాహనం.


