News November 30, 2024
BREAKING: రాష్ట్రానికి RED ALERT జారీ

ఫెంగల్ తుఫాన్ ఏపీ, తమిళనాడు తీరం వైపు దూసుకొస్తోంది. దీంతో ఏపీ, తమిళనాడుకు వాతావరణ శాఖ RED ALERT జారీ చేసింది. దీని ప్రభావంతో తిరుపతి, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. తుఫాన్ తీరం దాటేటప్పుడు 70-80కి.మీ వేగంతో గాలులు వీస్తాయని, ఆయా జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Similar News
News November 27, 2025
గంభీర్పై ఇప్పట్లో ఎలాంటి నిర్ణయం ఉండదు: BCCI

తన భవిష్యత్తుపై బీసీసీఐదే <<18393677>>నిర్ణయమన్న<<>> టీమ్ ఇండియా కోచ్ గంభీర్ వ్యాఖ్యలపై బోర్డు స్పందించింది. ఇప్పట్లో ఎలాంటి నిర్ణయం తీసుకోబోమని ఓ అధికారి వెల్లడించినట్లు NDTV పేర్కొంది. ప్రస్తుతం జట్టు మార్పుల దశలో ఉందని ఆయన తెలిపారు. అయితే కోచ్ మార్పు ఉండదని బీసీసీఐ స్పష్టమైన సంకేతాలిచ్చింది. కాగా భారత్ వరుస టెస్ట్ సిరీస్ల ఓటమి నేపథ్యంలో గంభీర్ను తొలగించాలంటూ డిమాండ్లు వచ్చాయి.
News November 27, 2025
ఆల్టైమ్ రికార్డు స్థాయికి నిఫ్టీ

స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో దూసుకెళ్తున్నాయి. నిఫ్టీ 26,295.55 వద్ద ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. ఉదయం 9:40 గంటల సమయానికి సెన్సెక్స్ 189 పాయింట్లు ఎగబాకి 85,799 వద్ద కొనసాగుతుండగా, నిఫ్టీ 52 పాయింట్లు పెరిగి 26,251 వద్ద ట్రేడవుతోంది. 2024 సెప్టెంబర్ 27 నాటి రికార్డు గరిష్ఠ స్థాయి 26,277ను అధిగమించింది. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.16%, స్మాల్ క్యాప్ 0.07% పెరిగాయి.
News November 27, 2025
వైకుంఠద్వార దర్శనం.. రిజిస్ట్రేషన్ మొదలు

AP: తిరుమలలో DEC 30 నుంచి JAN 8 వరకు కల్పించనున్న వైకుంఠద్వార దర్శనాల రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. తొలి 3 రోజులకు నేటి నుంచి DEC 1 వరకు ttdevasthanams.ap.gov.in, TTD యాప్, 9552300009 వాట్సాప్ నంబర్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవచ్చు. లక్కీ డిప్లో ఎంపికైన భక్తుల ఫోన్లకు DEC 2న మెసేజ్లు పంపుతారు. ఈ పవిత్ర దినాల్లో స్వామివారిని ఉత్తరద్వార దర్శనం చేసుకునేందుకు మీరూ అదృష్టాన్ని పరీక్షించుకోండి.


