News February 6, 2025

BREAKING: విద్యార్థులకు సూపర్ న్యూస్

image

AP: మధ్యాహ్నం భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు ఇకపై సన్నబియ్యం అందించాలని క్యాబినెట్ నిర్ణయించింది. ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం’పై మంత్రివర్గం చర్చించగా.. మెనూలో తీసుకొచ్చిన మార్పులను మంత్రి లోకేశ్ వివరించారు. ప్రాంతాల వారీగా పిల్లలు ఇష్టపడి తినే ఆహారాలను మెనూలో పెట్టనున్నట్లు చెప్పారు. లోకేశ్ చేసిన సన్నబియ్యం ప్రతిపాదనకు మంత్రి నాదెండ్ల మనోహర్ సహా ఇతర మంత్రులు అంగీకారం తెలిపారు.

Similar News

News February 6, 2025

తెలుగులోనూ జీవోలు.. ఇలా చూసేయండి!

image

AP: రాష్ట్ర ప్రభుత్వం అధికార సైట్‌లో ఇంగ్లిష్‌తో పాటు తెలుగులో జీవోలను అప్‌లోడ్ చేస్తోంది. <>https://goir.ap.gov.in<<>> లోకి వెళ్లి వ్యవసాయం, విద్య, ఆర్థిక, మున్సిపల్, రవాణా ఇలా అన్ని శాఖలకు సంబంధించిన జీవోలను తెలుగులో చూడొచ్చు.

News February 6, 2025

స్కూల్‌లో ఫైర్.. 17 మంది చిన్నారులు సజీవదహనం

image

నైజీరియాలోని ఓ పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో 17 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. జంఫారా స్టేట్ కైరా నమోదాలోని ఓ ఇస్లామిక్ స్కూల్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో బడిలో 100 మంది విద్యార్థులు ఉన్నారు. స్కూల్ పక్కనే నిల్వ ఉంచిన కర్రలకు మంటలు అంటుకుని ప్రమాదం సంభవించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

News February 6, 2025

మల్లన్నకు షోకాజ్ నోటీసులు, వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం

image

TG: కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఒక కులాన్ని దూషించడం, కులగణన నివేదికను దహనం చేయడంపై పార్టీ సీరియస్ అయింది. ఎమ్మెల్సీగా ఉండి పార్టీ రాజ్యాంగాన్ని, విధానాలను అతిక్రమించారని అందులో పేర్కొంది. షోకాజ్ నోటీసులకు ఫిబ్రవరి 12లోగా వివరణ ఇవ్వాలని, లేదంటే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

error: Content is protected !!