News February 6, 2025
BREAKING: విద్యార్థులకు సూపర్ న్యూస్

AP: మధ్యాహ్నం భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు ఇకపై సన్నబియ్యం అందించాలని క్యాబినెట్ నిర్ణయించింది. ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం’పై మంత్రివర్గం చర్చించగా.. మెనూలో తీసుకొచ్చిన మార్పులను మంత్రి లోకేశ్ వివరించారు. ప్రాంతాల వారీగా పిల్లలు ఇష్టపడి తినే ఆహారాలను మెనూలో పెట్టనున్నట్లు చెప్పారు. లోకేశ్ చేసిన సన్నబియ్యం ప్రతిపాదనకు మంత్రి నాదెండ్ల మనోహర్ సహా ఇతర మంత్రులు అంగీకారం తెలిపారు.
Similar News
News February 12, 2026
రేపు వైన్ షాపులు బంద్

TG: రేపు ఎన్నికల కౌంటింగ్ జరగనున్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో వైన్ షాపులు బంద్ కానున్నాయి. ఉ.6 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ముగిసేవరకూ మద్యం షాపులు మూసివేయాలని అధికారులు ఆదేశించారు. రేపు ఉ.8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది.
News February 12, 2026
85% చూపు కోల్పోయిన ఇమ్రాన్ ఖాన్!

పాక్ మాజీ PM ఇమ్రాన్ ఖాన్ కంటి చూపు మందగించింది. ఆయన కుడి కన్ను 85% విజన్ కోల్పోయిందని సుప్రీంకోర్టు నియమించిన లాయర్ తెలిపారు. 3 నెలలుగా కంటిచూపు సమస్యతో బాధపడుతున్నా జైలు అధికారులు చికిత్స అందించడం లేదని కోర్టుకు రిపోర్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఆరోగ్యంపై మెడికల్ రివ్యూకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అవినీతి ఆరోపణలతో అరెస్టయిన ఇమ్రాన్ 2023 AUG నుంచి జైలులోనే ఉన్నారు.
News February 12, 2026
రేపే మున్సిపల్ రిజల్ట్స్.. Way2Newsలో ఎక్స్క్లూజివ్గా..

7 కార్పొరేషన్లు.. 116 మున్సిపాలిటీలు.. సుమారు 13వేల మంది అభ్యర్థుల భవితవ్యం రేపు తేలిపోనుంది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానుంది. మీరెక్కడున్నా సమాచారం మీ ముందు ఉంచేందుకు Way2News సిద్ధంగా ఉంది. ప్రతి వార్డు, డివిజన్ ఫలితాలను ఎప్పటికప్పుడు ఎక్స్క్లూజివ్గా, అతివేగంగా మన యాప్లో తెలుసుకోండి.


