News March 9, 2025
BREAKING: టెన్త్ హాల్టికెట్లు విడుదల

ఏపీ ఓపెన్ టెన్త్ పరీక్షల హాల్టికెట్లు విడుదలయ్యాయి. ఈ నెల 17వ తేదీ నుంచి 28వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ప్రతిరోజూ ఉ.9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులు మనమిత్ర వాట్సాప్ నంబర్ లేదా స్టడీ కేంద్రాల ద్వారా హాల్టికెట్లు పొందవచ్చు. హాల్టికెట్ల కోసం ఇక్కడ <
Similar News
News March 26, 2025
నేనెప్పటికీ నాగ్ అభిమానినే: సౌబిన్ షాహిర్

లోకేశ్ తెరకెక్కిస్తున్న ‘కూలీ’ సినిమాలో నాగార్జునతో కలిసి నటించడం ఎంతో గర్వంగా ఉందని ‘మంజుమల్ బాయ్స్’ ఫేమ్ సౌబిన్ షాహిర్ చెప్పుకొచ్చారు. ‘కూలీ సెట్స్లో నేను ఆయనతో గడిపిన క్షణాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. నాగ్ను చూస్తుంటే స్టైల్, స్వాగ్ ఆయనే కనిపెట్టారనిపిస్తుంది. సెట్స్ నుంచి వచ్చాక అభిమానిగా ఆయన గురించి చెప్పకుండా ఉండలేకపోతున్నా. ఎప్పటికీ ఆయన అభిమానినే’ అని షాహిర్ సెల్ఫీ ఫొటోను షేర్ చేశారు.
News March 26, 2025
లంచ్లో వీటిని తీసుకుంటున్నారా?

కొందరు మధ్యాహ్న భోజనంలో ఏది పడితే అది తింటుంటారు. కానీ ఇలా చేస్తే దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మధ్యాహ్నం ఎక్కువగా సలాడ్లు తీసుకోవాలి. ఇవి శరీరానికి కావాల్సిన శక్తిని ఇస్తాయి. క్వినోవా, రోటీ, బ్రౌన్ రైస్, పెరుగు తినాలి. ఇవి జీర్ణక్రియ సక్రమంగా పనిచేసేలా చేస్తాయి. పండ్లు తింటే మీ బరువు నియంత్రణలో ఉంటుంది. లంచ్లో గుడ్లు, చేపలు తినడం ఉత్తమం.
News March 26, 2025
అప్సర హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు

TG: సంచలనం రేపిన <<10880696>>అప్సర<<>> హత్య కేసులో రంగారెడ్డి కోర్టు సంచలన తీర్పిచ్చింది. ఆమెను హత్య చేసిన నిందితుడు పూజారి సాయికృష్ణకు జీవితఖైదు విధించింది. కొన్నేళ్లుగా అప్సర అనే మహిళతో వివాహేతర సంబంధం నడిపిన సాయికృష్ణ 2023లో ఆమెను హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని మ్యాన్హోల్లో పడేసి, అప్సర కనిపించడంలేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడిపై అనుమానం రావడంతో దర్యాప్తు చేపట్టగా సాయికృష్ణే నిందితుడని తేలింది.