News April 1, 2024

BREAKING: YS షర్మిల పోటీ చేసేది ఇక్కడే

image

APలో ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ సీఈసీ ఖరారు చేసింది. కడప పార్లమెంట్ బరిలో వైఎస్ షర్మిల పోటీ చేయనుండగా.. ఇక్కడ వైసీపీ నుంచి ఎంపీ అవినాశ్ రెడ్డి బరిలో ఉన్నారు. అటు రాజమండ్రి నుంచి గిడుగు రుద్రరాజు, బాపట్ల నుంచి జేడీ శీలం, కాకినాడలో పల్లంరాజు, విశాఖ నుంచి సినీ నిర్మాత సత్యారెడ్డి బరిలో ఉండనున్నారు. ఇక 58 అసెంబ్లీ, 8 లోక్‌సభ స్థానాల అభ్యర్థుల ఎంపికను పెండింగ్‌లో పెట్టింది.

Similar News

News March 24, 2026

ALERT: పెట్రోల్ కొట్టిస్తున్నారా?

image

బంకుల్లో ఇంధనం కొట్టిస్తున్నప్పుడు చాలా మంది రీడింగ్ సున్నా ఉందో చెక్ చేస్తుంటారు. అయితే ఇంధన డెన్సిటీ చెక్ చేయడం ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. పెట్రోల్ డెన్సిటీ 720 – 775kg/m³, డీజిల్ 820 – 860kg/m³ మధ్య ఉండాలి. ఇది తక్కువగా ఉంటే ఇంధనంలో కల్తీ జరిగినట్లు అర్థం. ఈ ఇంధనం మైలేజీని తగ్గించడమే కాకుండా ఇంజిన్‌ను దెబ్బతీస్తుంది. అందుకే తప్పనిసరిగా ‘Density’ డిస్‌ప్లేలో చెక్ చేయండి. share it

News March 24, 2026

శివలీల.. పసుపు వేస్తే కుంకుమ అవుతుంది!

image

TG: హనుమకొండ జిల్లా పరకాలలోని శ్రీ కుంకుమేశ్వర స్వామి ఆలయం అద్భుత ఆధ్యాత్మిక నిలయం. ఇక్కడి శివలింగంపై రాత్రి వేళ భక్తితో పసుపు వేస్తే ఉదయానికి అది కుంకుమగా మారుతుందని భక్తుల విశ్వాసం. ఇది ఆ మహాశివుడి లీలతో పాటు పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహమని నమ్మకం. కాకతీయుల కాలం నాటి ఈ పురాతన దేవాలయంలోని ఈ వింతను చూసేందుకు భక్తులు పోటెత్తుతారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో(29/100)

News March 24, 2026

RDTకి అనుమతులు.. CBN క్రెడిట్ చోరీ: జగన్

image

AP: RDTకి FCRA <<19461876>>అనుమతుల<<>> విషయంలో CM CBN క్రెడిట్‌ చోరీకి పాల్పడడం ఆశ్చర్యంగా ఉందని జగన్ ట్వీట్ చేశారు. ‘నిజంగా ఆయన కృషి చేసి ఉంటే 2025 APRలో నిలిచిపోయిన పర్మిషన్ల రెన్యువల్‌కు ఏడాదికాలం ఎందుకు పట్టింది? CBN పట్టించుకోకపోవడం వల్లే YCP, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రజలు ఉద్యమం చేయాల్సి వచ్చిందన్నది వాస్తవం కాదా’ అని ప్రశ్నించారు. పర్మిషన్లు రెన్యువల్‌ చేసినందుకు PM మోదీ, అమిత్ షాకు ధన్యవాదాలు తెలిపారు.