News April 1, 2024
BREAKING: YS షర్మిల పోటీ చేసేది ఇక్కడే

APలో ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ సీఈసీ ఖరారు చేసింది. కడప పార్లమెంట్ బరిలో వైఎస్ షర్మిల పోటీ చేయనుండగా.. ఇక్కడ వైసీపీ నుంచి ఎంపీ అవినాశ్ రెడ్డి బరిలో ఉన్నారు. అటు రాజమండ్రి నుంచి గిడుగు రుద్రరాజు, బాపట్ల నుంచి జేడీ శీలం, కాకినాడలో పల్లంరాజు, విశాఖ నుంచి సినీ నిర్మాత సత్యారెడ్డి బరిలో ఉండనున్నారు. ఇక 58 అసెంబ్లీ, 8 లోక్సభ స్థానాల అభ్యర్థుల ఎంపికను పెండింగ్లో పెట్టింది.
Similar News
News February 1, 2026
మహిళా సాధికారతకు సరికొత్త బాట ‘షీ మార్ట్’

కేంద్ర బడ్జెట్ 2026లో మహిళలను వ్యాపార యజమానులుగా మార్చేందుకు ‘షీ మార్ట్’ పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. దీని ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలు సొంత రిటైల్ దుకాణాలను ఏర్పాటు చేసుకోవచ్చు. ఏడాదికి రూ.1 లక్ష కంటే ఎక్కువ ఆదాయం పొందేలా మహిళలకు శిక్షణ, ఆర్థిక తోడ్పాటు అందించడమే ఈ పథకం లక్ష్యం. స్థానిక పొదుపు సంఘాల్లో చేరి, నైపుణ్య శిక్షణ పొంది, బ్యాంకు రుణాల ద్వారా తమ వ్యాపార కలను సాకారం చేసుకోవచ్చు.
News February 1, 2026
సిట్కు కేసీఆర్ సంపూర్ణంగా సహకరించారు: KTR

TG: ఇవాళ జరిగిన సిట్ విచారణకు కేసీఆర్ సంపూర్ణంగా సహకరించారని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. ప్రతి ప్రశ్నకు కుండ బద్దలు కొట్టినట్లు సమాధానం ఇచ్చారన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘ఈ కేసులో లీకులే తప్ప ఆధారాల్లేవు. ఎలాంటి తప్పు జరగలేదని తేలిపోయింది. కేసులో డొల్లతనం బయటపడింది. మున్సిపల్ ఎన్నికల్లో మా అటెన్షన్ను దెబ్బ తీయడానికే విచారణ పేరుతో డ్రామా చేశారు’ అని దుయ్యబట్టారు.
News February 1, 2026
40 గంటలు.. 193 మంది మృతి

పాక్లోని బలూచిస్థాన్ ప్రావిన్స్ ఘర్షణలతో అట్టుడుకుతోంది. 40 గంటలపాటు BLA రెబల్స్, ఆర్మీ మధ్య జరిగిన దాడుల్లో 193 మంది చనిపోయారు. వీరిలో 145 మంది రెబల్స్, 17 మంది పోలీసులు, 31 మంది పౌరులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. క్వెట్టా సహా 12 ప్రాంతాల్లో గొడవలు జరుగుతున్నట్లు చెప్పారు. కాగా పాక్ విస్తీర్ణంలో 42 శాతం ప్రాంతం ఉన్న బలూచిస్థాన్కు స్వాతంత్య్రం కావాలని కొన్నేళ్లుగా పోరాటాలు జరుగుతున్నాయి.


