News April 25, 2024
BREAKING: టికెట్లు విడుదల

AP: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. జులై నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం(రూ.300 కోటా) టికెట్లను TTD <
Similar News
News January 13, 2026
జాగ్రత్త.. ఆ వీడియో చూసి స్టాక్స్ కొంటున్నారా?

స్టాక్స్ కొనేవారిని BSE అలర్ట్ చేసింది. తమ సీఈవో, ఎండీ సుందర రామమూర్తి కొన్ని కంపెనీల షేర్లు కొనాలని రిఫర్ చేస్తున్నట్లు SMలో చక్కర్లు కొడుతున్న వీడియో డీప్ఫేక్ అని వెల్లడించింది. తమ అధికారుల్లో ఎవరికీ స్టాక్ మార్కెట్ టిప్స్ ఇచ్చే అధికారం లేదని స్పష్టం చేసింది. ఇలాంటి మోసపూరిత, అనధికార వీడియోల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. SHARE IT.
News January 13, 2026
భోగి పళ్లలో ఏమేం ఉండాలి?

భోగి పళ్ల మిశ్రమంలో ప్రధానంగా రేగుపళ్లు ఉండాలి. వీటితో పాటు చిన్న చెరుకు ముక్కలు, శనగలు, చిల్లర నాణాలు, బంతిపూల రేకులు కలపాలి. కొన్ని ప్రాంతాల్లో వీటికి అదనంగా బియ్యం, నల్ల నువ్వులు కలుపుతారు. రేగుపళ్లు సూర్య భగవానుడికి ప్రీతిపాత్రమైనవి. నాణాలు లక్ష్మీదేవికి సంకేతం. ఈ వస్తువులన్నీ కలిపి పిల్లల తలపై పోయడం వల్ల వారిలోని గ్రహ దోషాలు తొలగి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం సిద్ధిస్తాయని సంప్రదాయం చెబుతోంది.
News January 13, 2026
మామిడి ఆకులపై బుడిపెల నివారణ ఎలా?

కొన్ని తోటల్లో మామిడి చెట్ల ఆకులపై బుడిపెలు కనిపిస్తూ ఉంటాయి. వీటి వల్ల ఆకులు ఎండి, రాలిపోతుంటాయి. మీడ్జ్ పురుగు ఆశించడం వల్ల ఆకులపై ఈ బొడిపెలు ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు. వీటి నివారణకు 100 లీటర్ల నీటిలో అజాడిరక్టిన్ (3000 పి.పి.ఎం) 300ml + క్లోరిపైరిఫాస్ 250mlను కలిపి చెట్ల ఆకులు పూర్తిగా తడిచేలా పిచికారీ చేయాలి. స్థానిక వ్యవసాయ అధికారుల సూచనల మేరకు ఈ మందును పిచికారీ చేయడం మంచిది.


