News March 2, 2025
BREAKING: భారత్ స్కోర్ ఎంతంటే?

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా న్యూజిలాండ్తో మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 249/9 స్కోర్ చేసింది. శ్రేయస్ (79), హార్దిక్ (45), అక్షర్ (42) రాణించారు. రోహిత్(15), గిల్ (2), కోహ్లీ(11), రాహుల్ (23), జడేజా(16) నిరాశపరిచారు. NZ బౌలర్లలో హెన్రీ 5 వికెట్లు తీశారు. ఈ మ్యాచులో గెలవాలంటే NZ 50 ఓవర్లలో 250 రన్స్ చేయాలి.
Similar News
News January 3, 2026
టీ20 వరల్డ్కప్ ఎవరూ చూడరు: అశ్విన్

T20 WC-26ని ఎవరూ చూడరని మాజీ క్రికెటర్ అశ్విన్ అభిప్రాయపడ్డారు. టోర్నీ ప్రారంభంలోనే చిన్న జట్లతో (USA, నమీబియా) IND ఆడటం, వరుసగా ICC టోర్నీలు జరుగుతుండడంతో ప్రేక్షకుల్లో ఇంట్రస్ట్ పోతుందన్నారు. ఒకప్పుడు WCలు నాలుగేళ్లకోసారి జరిగేవని, దీంతో చూడాలన్న ఇంట్రస్ట్ ఉండేదన్నారు. ప్రస్తుతం ODI WCలు 4yrs, T20 WCలు 2yrsకి ఒకసారి జరుగుతున్నాయి. కరోనా వల్ల 2020 WC వాయిదాతో 2021 నుంచి 3 T20 WCలు జరిగాయి.
News January 3, 2026
డబ్బు ఆదా.. మేకప్ ఖాళీ: ఏంటి ఈ Project Pan ట్రెండ్?

మేకప్ ప్రియుల కోసం సోషల్ మీడియాలో ‘Project Pan’ అనే కొత్తట్రెండ్ నడుస్తోంది. దీని ముఖ్య ఉద్దేశం అనవసరంగా కొత్త కాస్మెటిక్స్ కొనకుండా ఉన్న వాటినే పూర్తిగా వాడటం. ఐషాడో లేదా మేకప్ బాక్స్లో అడుగు భాగం (Pan) కనిపించే వరకు వాడటమే దీని లక్ష్యం. డబ్బు ఆదా చేయడమే కాకుండా వస్తువులను వృథా చేయకుండా ప్రోత్సహిస్తుంది. No Buy రూల్ పాటించడం ద్వారా పిచ్చిగా షాపింగ్ చేసే అలవాటునూ అరికట్టొచ్చు.
News January 3, 2026
నేడు ఉల్లి రైతుల ఖాతాల్లోకి డబ్బులు

AP: ప్రకృతి వైపరీత్యాలు, ధరల పతనంతో నష్టపోయిన ఉల్లి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనుంది. ఖరీఫ్లో ఉల్లి సంక్షోభాన్ని ప్రభుత్వం గుర్తించిందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. కర్నూలు, కడప జిల్లాలకు చెందిన 37,752 మంది రైతుల అకౌంట్లలో రూ.128.33 కోట్లను ఈరోజు జమ చేయనున్నారు. కర్నూల్ జిల్లాల్లోనే 31,352 మంది ఖాతాల్లో రూ.99.92కోట్లు జమ కానున్నట్లు పేర్కొన్నారు.


