News January 29, 2025

బీమా డబ్బు కోసం చెల్లెలిపై అన్న ఘాతుకం

image

AP: ఇన్సూరెన్స్ డబ్బు కోసం సొంత చెల్లినే సోదరుడు హత్య చేసిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. కాటూరివారిపాలేనికి చెందిన సంధ్యకు పెళ్లి అయ్యి పిల్లలు పుట్టకపోవడంతో భర్త వదిలేశాడు. దీంతో ఆమె తన అన్న అశోక్ కుమార్ వద్ద ఉంటోంది. రియల్ ఎస్టేట్‌లో నష్టపోయిన అశోక్ తన చెల్లెలిపై వేర్వేరు కంపెనీల్లో రూ.1.20 కోట్లకు ఇన్సూరెన్స్ చేసి చంపేశాడు. ఈ ఘటన గతేడాది జరగ్గా పోలీసుల విచారణలో ఇప్పుడు బయటపడింది.

Similar News

News February 8, 2025

సమంతతో విడాకులు.. ఆ విషయంలో బాధపడ్డా: నాగచైతన్య

image

సమంతతో తాను విడాకులు తీసుకోవడానికి శోభిత ధూళిపాళ్ల కారణమని జరిగిన ప్రచారంపై నాగచైతన్య స్పందించారు. ‘ఇది చూసి నేను చాలా బాధపడ్డా. ఆమెకు ఈ చెడ్డపేరు రావాల్సింది కాదు. విడాకులకు శోభిత కారణమే కాదు. ఆమె నా జీవితంలోకి ఇన్‌స్టా చాట్‌లా చాలా సాధారణంగా, అందంగా వచ్చింది. మా మధ్య తొలుత స్నేహం, ఆ తర్వాత రిలేషన్‌షిప్ మొదలైంది’ అని స్పష్టం చేశారు. కాగా 2021లో సమంతతో విడిపోయిన చైతూ 2024లో శోభితను వివాహమాడారు.

News February 8, 2025

కరుణ్ నాయర్ మరో సెంచరీ

image

డొమెస్టిక్ క్రికెట్‌లో విదర్భ ప్లేయర్ <<15137627>>కరుణ్ నాయర్<<>> వీరవిహారం చేస్తున్నారు. రంజీ క్వార్టర్ ఫైనల్-2లో భాగంగా తమిళనాడుతో మ్యాచులో ఆయన మరో సెంచరీ బాదారు. 180 బంతుల్లో 100 పరుగులు పూర్తి చేసుకున్నారు. కాగా విజయ్ హజారే ట్రోఫీలోనూ కరుణ్ 5 సెంచరీలు బాదిన విషయం తెలిసిందే. దీంతో ఆయన టీమ్ ఇండియాకు సెలక్ట్ అవుతారని అందరూ భావించారు. కానీ ఇంగ్లండ్‌తో జరుగుతున్న టీ20, వన్డే సిరీస్‌కు BCCI ఎంపిక చేయలేదు.

News February 8, 2025

ప్రాంతీయ పార్టీలకు గడ్డుకాలం.. నెక్స్ట్ టార్గెట్ బెంగాలేనా?

image

దేశంలో ప్రాంతీయ పార్టీలు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఏపీలో వైసీపీ, తెలంగాణలో BRS, ఒడిశాలో బిజూ జనతాదళ్, MHలో శివసేన (ఉద్ధవ్), ఎన్సీపీ (శరద్ పవార్) పార్టీలు అధికారాన్ని కోల్పోయాయి. ఏపీలో టీడీపీ, బిహార్‌లో JDU ఎన్డీయేలో భాగస్వాములుగా ఉన్నాయి. ప.బెంగాల్‌లో మమతా బెనర్జీ, TNలో స్టాలిన్ బలంగా నిలబడ్డారు. మోదీ నెక్స్ట్ టార్గెట్ బెంగాల్ అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మీ కామెంట్?

error: Content is protected !!