News September 4, 2024
నెల జీతం విరాళంగా ప్రకటించిన BRS

TG: వరద బాధితులకు BRS పార్టీ MLA, MP, MLCలు తమ నెల జీతాన్ని విరాళంగా ప్రకటించారు. మాజీ సీఎం, ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలతోనే ఈ ప్రకటన చేస్తున్నట్లు సిద్దిపేట వేదికగా MLA హరీశ్రావు వెల్లడించారు. దీంతో పాటు ఖమ్మం వరద బాధితులకు నిత్యావసర సరకులు పంపించేందుకు ఏర్పాట్లు ఆయన చేస్తున్నారు.
Similar News
News February 5, 2026
నారా రోహిత్-అల్లరి నరేశ్ కాంబోలో కామెడీ ఎంటర్టైనర్?

టాలీవుడ్లో మరో మల్టీ స్టారర్ మూవీ తెరకెక్కనుంది. అల్లరి నరేశ్, నారా రోహిత్ కలిసి నటించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్నట్లు సమాచారం. నారా రోహిత్తో ‘సుందరకాండ’ తీసిన వెంకటేశ్ నిమ్మలపూడి ఈ చిత్రానికి డైరెక్టర్గా, హరీశ్ పెద్ది నిర్మాతగా వ్యవహరించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్ ఉంది.
News February 5, 2026
రైతు భరోసా ఇప్పుడే వేయాలి: KTR

TG: రైతు భరోసాను మున్సిపల్ ఎన్నికల తరువాత ఇస్తామని CM రేవంత్ చెప్పడంపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR మండిపడ్డారు. ‘KCR DECలోనే ఇచ్చేవారు. డిసెంబర్లో వేయాల్సిన డబ్బులు నేటికీ ఇవ్వకుండా ఇప్పుడు ఎన్నికలయ్యాక ఇస్తామనడం ఏమిటి? మున్సిపల్ ఎన్నికలే కదా? రైతులకు ఇచ్చేదానికి ఎవరు అడ్డం పడ్డారు? ఇప్పుడే ఇవ్వాలి. ఎన్నికలయ్యాక అంటే ఏరు దాటాక బోడిమల్లన్న అంటారు’ అని సిరిసిల్ల ఎన్నికల ప్రచారంలో పేర్కొన్నారు.
News February 5, 2026
మేం వెళ్తున్నాం.. ఫ్లైట్ బుక్ చేశాం: సూర్య

T20 WCలో ఈనెల 15న జరిగే లీగ్ మ్యాచ్ను పాక్ <<19024958>>బాయ్కాట్ చేయడం<<>>పై టీమ్ ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించారు. ఈ విషయంలో తమ జట్టు సన్నద్ధతలో ఎలాంటి మార్పు లేదని చెప్పారు. ‘మేం స్పష్టంగానే ఉన్నాం. వాళ్ల(పాకిస్థాన్)తో ఆడబోమని మేం చెప్పలేదు. అలా అన్నది వాళ్లే. USA, కెనడాతో మ్యాచ్ల తర్వాత మేం కొలంబో వెళ్తాం. మా ఫ్లైట్ బుక్ అయింది. మేం వెళ్తున్నాం’ అని కెప్టెన్స్ మీట్లో చెప్పారు.


