News May 4, 2024
ప్రజలకు, నాకు మధ్య బీఆర్ఎస్ గ్యాప్ సృష్టించింది: తమిళిసై

TG: రాష్ట్ర ప్రజలకు, తనకు మధ్య బీఆర్ఎస్ గ్యాప్ సృష్టించిందని మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ‘రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని పెట్టడానికి ప్రయత్నించాను. కానీ అప్పటి BRS ప్రభుత్వం అందుకు సహకరించలేదు. కేంద్ర పథకాలను ప్రజలకు అందించాలనేదే నా లక్ష్యం’ అని సంగారెడ్డిలో విశిష్ట సంపర్క అభియాన్ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. కాంగ్రెస్లో ప్రధాని అభ్యర్థి ఎవరో వాళ్లకే తెలియదంటూ ఎద్దేవా చేశారు.
Similar News
News December 9, 2025
2,569 పోస్టులు.. దరఖాస్తుకు రేపే ఆఖరు తేదీ

RRBలో 2,569 జూనియర్ ఇంజినీర్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. ఇప్పటివరకు అప్లై చేసుకోనివారు చేసుకోవచ్చు. DEC 12వరకు ఫీజు చెల్లించవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిప్లొమా, B.Sc ఉత్తీర్ణులై, 18- 33 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. నెలకు జీతం రూ.35,400 చెల్లిస్తారు. www.rrbcdg.gov.in *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News December 9, 2025
25 మంది మృతి.. థాయ్లాండ్కి పరారైన ఓనర్లు

గోవాలోని ఓ నైట్క్లబ్లో జరిగిన <<18501326>>అగ్నిప్రమాదం<<>>లో 25 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఘటన తర్వాత క్లబ్ ఓనర్లు గౌరవ్, సౌరభ్ లూథ్రా థాయ్లాండ్లోని ఫుకెట్కు పరారైనట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రమాదం జరిగిన ఐదు గంటల్లోనే డిసెంబర్ 7న ఇండిగో విమానం 6E 1073లో వారు దేశం విడిచినట్లు వెల్లడైంది. వీరిద్దరిపై పోలీసులు FIR నమోదు చేశారు. ప్రస్తుతం ఇంటర్పోల్ సహాయంతో వారి అరెస్ట్కు చర్యలు చేపట్టారు.
News December 9, 2025
నువ్వుల సాగు.. విత్తనశుద్ధి, విత్తే పద్ధతి

నేల నుంచి సంక్రమించే తెగుళ్లను నివారించడానికి కిలో విత్తనానికి కార్బండిజం 2.5గ్రా. లేదా మాంకోజెబ్ 3గ్రా. కలిపి విత్తనశుద్ధి చేయాలి. పంట తొలి దశలో రసం పీల్చే పురుగుల నుంచి పంటను కాపాడటానికి కిలో విత్తనానికి ఇమిడాక్లోప్రిడ్ 600 FS 5ml కలిపి విత్తనశుద్ధి చేసి విత్తుకోవాలి. వరుసల మధ్య 30సెం.మీ, మొక్కల మధ్య 15సెం.మీ దూరం ఉండేటట్లు విత్తాలి. విత్తనాన్ని వెదజల్లడం కంటే విత్తడం మేలంటున్నారు నిపుణులు.


