News February 4, 2025

ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా బీఆర్ఎస్!

image

TG: గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. నిన్నటి నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవ్వగా అభ్యర్థుల పేర్లను ఇప్పటికీ ప్రకటించకపోవడం దీనికి ఊతమిస్తోంది. గత ఏడాది ఎంపీ ఎన్నికల ఫలితాలు, ఆ తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఓటమి దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. స్వతంత్ర అభ్యర్థులకు మద్దతిచ్చే యోచనలో ఉందని తెలుస్తోంది.

Similar News

News January 18, 2026

APPLY NOW: SAILలో ఉద్యోగాలు

image

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (<>SAIL<<>>)కు చెందిన బర్న్‌పుర్ హాస్పిటల్‌లో 22కన్సల్టెంట్స్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి MBBS, పీజీ డిప్లొమా/పీజీ డిగ్రీ/DNB/DM/MCh/DrNB/DIH అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. జనవరి 20, 21 తేదీల్లో ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://sailcareers.com/

News January 18, 2026

అరటి పండ్ల విషయంలో గొడవ.. హిందూ వ్యాపారిని కొట్టిచంపారు!

image

బంగ్లాదేశ్‌లో మరో హిందువు హత్యకు గురయ్యాడు. ‘ఘాజీపూర్‌లో లిటన్ చంద్ర ఘోష్ (55) హోటల్ నిర్వహిస్తున్నాడు. మాసుమ్ మియాకు అరటి తోట ఉంది. ఈ క్రమంలో తమ అరటి పండ్లను ఎవరో ఎత్తుకెళ్లారని ఫిర్యాదు చేశాడు. లిటన్ హోటల్ వద్ద అవి కనిపించడంతో మాసుమ్‌, అతడి తల్లిదండ్రులు స్వాపన్, మాజేదా వాగ్వాదానికి దిగారు. విచక్షణారహితంగా కొట్టడంతో లిటన్ చనిపోయాడు. ముగ్గురినీ అరెస్టు చేశాం’ అని పోలీసులు తెలిపారు.

News January 18, 2026

ప్రజా దర్బార్ ప్రాముఖ్యత మీకు తెలుసా?

image

నాగోబా జాతరలో ప్రజా దర్బార్ కీలకమైన ఘట్టం. దీనికి వందేళ్ల చరిత్ర ఉంది. పూర్వం గిరిజనులు తమ గోడును రాజులకు చెప్పుకోవడానికి ఈ దర్బార్‌ను వేదికగా చేసుకునేవారు. నేటికీ ఆ సంప్రదాయం సాగుతోంది. జాతరలో ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు వస్తారు. గిరిజనులు తమ భూమి, విద్య, ఆరోగ్యం వంటి సమస్యలను వివరించి పరిష్కారం కోరుతారు. ఆధ్యాత్మికతతో పాటు సామాజిక సమస్యల పరిష్కారానికి ఇది గొప్ప వేదికగా నిలుస్తుంది.