News October 3, 2024
మూసీ నిర్వాసితులకు BRS రూ.500కోట్లు ఇవ్వాలి: CM

TG: BRS పార్టీ అకౌంట్లో రూ.1500కోట్లు ఉన్నాయని, అందులో రూ.500 కోట్లు మూసీ నిర్వాసితులకు ఇవ్వాలని CM రేవంత్ అన్నారు. హైడ్రా విషయంలో ప్రతిపక్షం ఎందుకు సూచనలు ఇవ్వలేదని ప్రశ్నించారు. అక్రమంగా నిర్మించిన కేటీఆర్, హరీశ్ రావు, సబిత ఫామ్ హౌస్లను కూల్చాలా? వద్దా? అనే విషయంలో వాళ్లు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు 15వేల డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని చెప్పారు.
Similar News
News December 16, 2025
TRAIలో టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (<
News December 16, 2025
శనగలో ఇనుము లోప లక్షణాలు – నివారణ

సాధారణంగా సున్నపు నిల్వలు ఎక్కువగా ఉండి, ఉదజని సూచిక ఎక్కువ ఉన్న నేలల్లో నాటిన శనగ పంటలో ఇనుపధాతు లోపం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ లోపం వల్ల లేత ఆకులు పసుపు రంగులోకి మారి, ఎండి రాలిపోతాయి. నేలలకు ఫెర్రస్ సల్ఫేట్ నేరుగా అందించడం అంత లాభదాయకం కాదు. కాబట్టి ప్రతి లీటరు నీటికి ఫెర్రస్ సల్ఫేట్ 5గ్రా, ఒక గ్రాము నిమ్మ ఉప్పుతో కలిపి పైరుపై వారం రోజుల తేడాతో రెండు సార్లు పిచికారీ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
News December 16, 2025
వెంకటేశ్ అయ్యర్కు రూ.7 కోట్లు

IPL-2026 మినీ వేలంలో వెంకటేశ్ అయ్యర్ను RCB రూ.7 కోట్లకు దక్కించుకుంది. గత మెగా వేలంలో ఇతడిని కోల్కతా రూ.23.75 కోట్లకు దక్కించుకుంది. మినీ వేలానికి ముందు రిలీజ్ చేసింది. దీంతో వేలానికి వచ్చిన అయ్యర్ను ఆర్సీబీ సొంతం చేసుకుంది. అటు రూ.75 లక్షల బేస్ ప్రైస్ ఉన్న ఆల్రౌండర్ దీపక్ హుడా అన్సోల్డ్గా మిగిలారు.


