News April 11, 2025
సభ అనుమతులపై హైకోర్టుకు BRS

TG: ఎల్కతుర్తిలో నిర్వహించే సభకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంపై BRS హైకోర్టును ఆశ్రయించింది. పార్టీ స్థాపించి 25సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా సభ జరుపుతున్నామని కోర్టుకు తెలిపింది. సభకు అనుమతులిచ్చేలా ఆదేశాలివ్వాలని పిటిషన్లో కోరింది. హైకోర్టు విచారణను 17కు వాయిదా వేసింది. ఈ నెల 27న BRS సిల్వర్ జూబ్లీ వేడుకలను ఎల్కతుర్తిలో నిర్వహించేలా పార్టీ నిర్ణయించగా, పోలీసులు అనుమతివ్వలేదు.
Similar News
News April 24, 2025
వెంకటేశ్తో కలిసి సినిమా.. నాని ఏమన్నారంటే?

శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో ‘ప్యారడైజ్’ మూవీ షూటింగ్ మే 2న ప్రారంభమవుతుందని హీరో నాని తెలిపారు. ఆ సినిమా వచ్చే ఏడాది మార్చి 26న విడుదలవుతుందని చెప్పారు. ఆ తర్వాత సుజీత్తో చిత్రం ఉంటుందన్నారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘వెంకటేశ్, నేను హీరోలుగా త్రివిక్రమ్ ఓ సినిమా చేయాలనుకున్నారు. అలాగే శేఖర్ కమ్ములతోనూ చర్చలు జరిగాయి. అయితే ఆ ప్రాజెక్టులు పట్టాలెక్కలేదు’ అని పేర్కొన్నారు.
News April 24, 2025
ఏప్రిల్ 24: చరిత్రలో ఈరోజు

✒ 1929: ప్రముఖ నటుడు రాజ్కుమార్ జననం
✒ 1934: నిర్మాత ఏడిద నాగేశ్వరరావు జననం
✒ 1969: జ్యోతిష పండితుడు శంకరమంచి రామకృష్ణ శాస్త్రి జననం
✒ 1973: మాజీ క్రికెటర్ సచిన్ జననం
✒ 1993: 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీ వ్యవస్థ అమలులోకి వచ్చింది
✒ 2011: ఆధ్యాత్మిక గురువు సత్యసాయి బాబా మరణం
News April 24, 2025
పాక్పై సానుభూతి చూపేదిలేదు: కిషన్రెడ్డి

దేశ ప్రయోజనాల విషయంలో రాజీపడేది లేదని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి స్పష్టం చేశారు. ఉగ్రదాడి వెనకున్న పాక్తో సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం మంచి పరిణామమన్నారు. ఆ దేశంపై సానుభూతి చూపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇప్పుడు దౌత్యపరమైన సమాధానమే ఇచ్చామని, త్వరలో మిలటరీ పరంగానూ ఆన్సర్ ఉంటుందని తెలిపారు. ఉగ్రదాడిలో పోయిన ప్రతి ప్రాణానికి ప్రతీకారం తప్పదనే సంకేతాలు కేంద్రం ఇచ్చిందన్నారు.