News February 1, 2025
BUDGET 2025: నగరాల కోసం రూ.లక్ష కోట్లతో కొత్త ఫండ్

నగరాలను గ్రోత్ హబ్స్గా మార్చేందుకు, క్రియేటివ్ రీ డెవలప్మెంటుకు మద్దతిచ్చేందుకు రూ.లక్ష కోట్లతో ‘అర్బన్ ఛాలెంజ్ ఫండ్’ను నిర్మలా సీతారామన్ ప్రకటించారు. తాగునీరు, పారిశుద్ధ్య మౌలిక సదుపాయాలకు ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. ఆధారపడతగిన ప్రాజెక్టులకు ఇది 25% నిధులు ఇస్తుందన్నారు. బాండ్లు, బ్యాంకు లోన్లు, PPP పద్ధతిలో 50% నిధి ఏర్పాటు చేస్తామన్నారు. FY 2025-26కి గాను రూ.10వేల కోట్లు కేటాయించారు.
Similar News
News November 23, 2025
బోస్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News November 23, 2025
శ్రీవారి ఆలయంలో పంచబేర వైభవం

తిరుమల శ్రీవారి ఆలయ గర్భగుడిలో 5 ప్రధానమైన మూర్తులు కొలువై ఉన్నాయి. ప్రధానమైనది, స్వయంవ్యక్త మూర్తి అయినది ధ్రువబేరం. నిత్యం భోగాలను పొందే మూర్తి భోగ శ్రీనివాసుడు ‘కౌతుకబేరం’. ఉగ్ర రూపంలో ఉండే స్వామి ఉగ్ర శ్రీనివాసుడు ‘స్నపన బేరం’. రోజువారీ కొలువు కార్యక్రమాలలో పాల్గొనే మూర్తి కొలువు శ్రీనివాసుడు ‘బలిబేరం’. ఉత్సవాల కోసం ఊరేగింపుగా వెళ్లే మూర్తి మలయప్పస్వామి ‘ఉత్సవబేరం’. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News November 23, 2025
రేపు వాయుగుండం.. 48 గంటల్లో తుఫాన్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మలక్కా, సౌత్ అండమాన్ మీదుగా కొనసాగుతోందని APSDMA తెలిపింది. ఇది వాయవ్యదిశగా కదులుతూ రేపటికల్లా వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. అదేవిధంగా కొనసాగుతూ 48 గంటల్లో తుఫాన్గా బలపడే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి డిసెంబర్ 1 వరకు ఏపీలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే పేర్కొన్న సంగతి తెలిసిందే.


