News February 1, 2025

ఎన్నికల దృ‌ష్ట్యా బడ్జెట్ రూపకల్పన?

image

కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ఢిల్లీ, బిహార్‌ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకునే రూపొందించిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీ ఎన్నికల్లో విద్యాధికులు, ఉద్యోగుల ప్రభావమే ఎక్కువగా ఉండనుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు ఆదాయ పన్ను భారీ మినహాయింపును ప్రకటించిందని అంటున్నారు. ఇక బిహార్‌ ఎన్నికల దృ‌ష్ట్యా ఇబ్బడి ముబ్బడిగా పలు మార్గాల్లో నిధుల్ని కేటాయించిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మీ అభిప్రాయం?

Similar News

News February 19, 2025

6నెలల్లో క్యాన్సర్ టీకా అందుబాటులోకి: కేంద్రమంత్రి

image

మహిళల్లో క్యాన్సర్‌ను నివారించేందుకు ఉపయోగపడే టీకాను మరో 6 నెలల్లో అందుబాటులోకి తీసుకొస్తామని కేంద్ర వైద్యారోగ్య శాఖ సహాయమంత్రి ప్రతాప్ రావ్ జాదవ్ తెలిపారు. 9 ఏళ్ల నుంచి 16 ఏళ్లలోపు బాలికలకు ఈ టీకాలను అందిస్తామని వివరించారు. రొమ్ము, నోరు, గర్భాశయ క్యాన్సర్లను ఈ టీకా నియంత్రిస్తుందని, ప్రస్తుతం ప్రయోగాలు జరుగుతున్నాయని చెప్పారు.

News February 19, 2025

ఎయిరిండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ప్రయాణికులు ఆందోళన

image

ముంబై-దుబాయ్ ఎయిరిండియా విమానాన్ని అధికారులు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. నిన్న రాత్రి 8 గంటలకు బయలుదేరాల్సిన విమానం 50 నిమిషాల తర్వాత ముంబైలో ల్యాండ్ చేశారు. ఏం జరుగుతుందో తెలియక ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అధికారులు వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించాక తెల్లవారుజామున 4 గంటలకు విమానం బయలుదేరింది. విమానంలో ఎక్కువ మంది తెలుగు రాష్ట్రాల ప్రయాణికులే ఉన్నారు.

News February 19, 2025

ఛాంపియన్స్ ట్రోఫీ: విజేతలు వీరే

image

* 1998- దక్షిణాఫ్రికా
* 2000- న్యూజిలాండ్
* 2002- భారత్ & శ్రీలంక(సంయుక్తం)
* 2004- వెస్టిండీస్
* 2006- ఆస్ట్రేలియా
* 2009- ఆస్ట్రేలియా
* 2013- భారత్
* 2017- పాకిస్థాన్

error: Content is protected !!