News February 1, 2025
140 కోట్ల మంది ఆశలు తీర్చే బడ్జెట్: మోదీ

ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్పై ప్రధాని మోదీ స్పందించారు. ఇది 140 కోట్ల మంది ప్రజల ఆశలు నెరవేర్చే బడ్జెట్ అని కొనియాడారు. ఈ బడ్జెట్ ద్వారా పొదుపు, పెట్టుబడులు పెరుగుతాయని వెల్లడించారు. ప్రభుత్వాలు ఖజానాను నింపడంపైనే దృష్టి సారిస్తాయని, కానీ ఈ బడ్జెట్ ప్రజల జేబులు నింపేందుకు, సేవింగ్స్ పెంచేలా తాము రూపొందించామన్నారు. రూ.12లక్షల వరకూ పన్ను లేకపోవడం మధ్య తరగతి ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందన్నారు.
Similar News
News January 28, 2026
రాష్ట్రానికి రూ.13 వేల కోట్లు

AP: జల్జీవన్ మిషన్ కింద రాష్ట్రానికి భారీగా నిధులు రానున్నాయి. గతంలో ఆగిపోయిన సుమారు రూ.23 వేల కోట్ల పనులకు కేంద్రం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఇందులో కేంద్ర వాటాగా రూ.13 వేల కోట్లు విడుదల కానున్నాయి. 2027 నాటికి ప్రతి ఇంటికీ సురక్షిత కుళాయి నీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. CM చంద్రబాబు, Dy.CM పవన్ కళ్యాణ్ కేంద్రంతో చర్చలు జరపడంతో నిధుల విడుదలకు లైన్ క్లియరైంది.
News January 28, 2026
ముడతలు, మచ్చలు తగ్గించే ఎగ్ ఫేస్ ప్యాక్

వయసు పెరిగే కొద్దీ చర్మంపై మచ్చలు ముడతలు వస్తుంటాయి. వీటిని తొలగించడంలో ఎగ్ ఫేస్ ప్యాక్ ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు. ఒక ఎగ్ వైట్, కలబంద గుజ్జు, పంచదార పొడి బాగా కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడిగేసుకుంటే సరిపోతుంది. ఇలా తరచూ చేస్తుంటే ముఖం అందంగా మెరిసిపోతుంది.
News January 28, 2026
30 రోజుల లోపు మొక్కజొన్న పంటలో కత్తెర పురుగు కట్టడికి సూచనలు

మొక్కజొన్న విత్తిన వెంటనే ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలను అమర్చి కత్తెర పురుగు ఉనికిని గమనించాలి. మొక్కలపై వాటి గుడ్లను గమనిస్తే వేపమందును పిచికారీ చేయాలి. లేత మొక్కజొన్న పంటల్లో 30 రోజుల వరకు ఎకరాకు 15 పక్షి స్థావరాలను, 15 లింగాకర్షక బుట్టలను పైరులో ఏర్పాటు చేసుకోవాలి. ఎకరాకు 9 కిలోల పొడి ఇసుక, కిలో సున్నాన్ని కలిపి మొక్కజొన్న సుడులలో వేస్తే ఇసుక రాపిడికి కత్తెర పురుగు లార్వాలు చనిపోతాయి.


