News February 1, 2025
140 కోట్ల మంది ఆశలు తీర్చే బడ్జెట్: మోదీ

ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్పై ప్రధాని మోదీ స్పందించారు. ఇది 140 కోట్ల మంది ప్రజల ఆశలు నెరవేర్చే బడ్జెట్ అని కొనియాడారు. ఈ బడ్జెట్ ద్వారా పొదుపు, పెట్టుబడులు పెరుగుతాయని వెల్లడించారు. ప్రభుత్వాలు ఖజానాను నింపడంపైనే దృష్టి సారిస్తాయని, కానీ ఈ బడ్జెట్ ప్రజల జేబులు నింపేందుకు, సేవింగ్స్ పెంచేలా తాము రూపొందించామన్నారు. రూ.12లక్షల వరకూ పన్ను లేకపోవడం మధ్య తరగతి ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందన్నారు.
Similar News
News November 5, 2025
CCRHలో 90 పోస్టులు

సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి (<
News November 5, 2025
భార్యాభర్తల మధ్య అనుబంధాల కోసం..

కార్తీక పౌర్ణమి రోజున కేదారేశ్వర వ్రతాన్ని ఆచరిస్తే భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ వ్రతంలో భాగంగా మర్రి చెట్టు ఊడలను తోరణాలుగా, మర్రి పళ్లను బూరెలుగా, ఆకులను విస్తర్లుగా ఉపయోగించి పూజించడం సంప్రదాయం. నేడు శివాలయంలో దీపారాధన చేయడం వల్ల ముక్కోటి దేవతల పూజాఫలం, పుణ్య నదులలో స్నానం చేసిన ఫలితం దక్కుతుందని, ఇహపరలోకాలలో సుఖసౌఖ్యాలు, ముక్తి లభిస్తాయని పండితులు అంటున్నారు.
News November 5, 2025
మిరపలో కుకుంబర్ మొజాయిక్ తెగులను ఎలా నివారించాలి?

మిరప పంటను ఆశించే ఈ వైరస్ తెగులు పేనుబంక ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ తెగులు సోకిన మొక్కల్లో ఎదుగుదల లోపిస్తుంది. మొక్కలు పొట్టిగా కనిపిస్తాయి. ఆకులు రంగుమారిపోతాయి. మొక్కలకు పూత ఉండదు. ఈ వైరస్ సోకిన మొక్కలను పీకి నాశనం చేయాలి. వ్యాధిని వ్యాప్తి చేసే పేనుబంక నివారణకు ఎసిఫేట్ 1.5 గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.25mlను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.


