News January 7, 2025

ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ రేసులో బుమ్రా

image

ఐసీసీ ప్రతి నెలా ఉత్తమ ప్రదర్శన చేసిన క్రికెటర్లకు ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు ఇస్తున్న సంగతి తెలిసిందే. గత నెలకు భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా, ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్, దక్షిణాఫ్రికా బౌలర్ డేన్ ప్యాటర్సన్‌ను నామినేట్ చేసింది. బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో బుమ్రా 32 వికెట్లతో రాణించగా కమిన్స్ 25 వికెట్లు, 159 పరుగులు చేశారు. ఇక ప్యాటెర్సన్ పాక్‌తో 2 టెస్టుల్లో 13 వికెట్లు పడగొట్టారు.

Similar News

News December 28, 2025

Op సిందూర్ టైమ్‌లో బంకర్‌లోకి వెళ్లమన్నారు: పాక్ అధ్యక్షుడు

image

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’తో పాక్ అగ్రనాయకత్వం భయాందోళనకు గురైందని అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ అంగీకరించారు. ఆ సమయంలో ప్రాణరక్షణ కోసం బంకర్‌లోకి వెళ్లాలని సైనిక కార్యదర్శి తనకు సూచించారని వెల్లడించారు. అందుకు తాను నిరాకరించినట్లు తెలిపారు. కాగా భారత క్షిపణుల ధాటికి పాక్ బెంబేలెత్తిపోయిందనే విషయం దీని ద్వారా స్పష్టమైంది.

News December 28, 2025

50 మందికి పైగా దుర్మరణం.. సిగాచీ CEO అరెస్ట్

image

TG: సిగాచీ కంపెనీ CEO అమిత్‌రాజ్‌ను పటాన్‌చెరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఏడాది జూన్‌లో సంగారెడ్డి(D) పాశమైలారంలోని సిగాచీ కంపెనీలో భారీ పేలుడు సంభవించి 50 మందికి పైగా కార్మికులు మరణించారు. దీంతో ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా నిన్న రాత్రి CEOను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అటు బాధితులకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని యాజమాన్యాన్ని హైకోర్టు ఇప్పటికే ఆదేశించింది.

News December 28, 2025

సాగు కోసం వర్షపు నీటిని కాపాడుకుందాం

image

వ్యవసాయానికి వాన నీరే కీలకం. ఈ నీటిని పరిరక్షించి, భూగర్భ జలాలను పెంచుకోవడం చాలా అవసరం. దీని కోసం వర్షపు నీరు నేలలో ఇంకేలా వాలుకు అడ్డంగా కాలువలు, కందకాలు తీసి నీరు వృథాగా పోకుండా చూడాలి. నీటి గుంటలు, చెక్‌డ్యామ్స్, ఫామ్‌పాండ్స్ ఏర్పాటు చేసి భూగర్భజలాలను పెంచవచ్చు. బీడు భూముల్లో చెట్ల పెంపకం, సామాజిక అడవుల పెంపకం చేపట్టాలి. దీని వల్ల భూగర్భ జలాలు పెరగడంతో పాటు నేలకోత తగ్గి భూసారం పెరుగుతుంది.