News December 27, 2024
కాలువలో పడిన బస్సు.. 8 మంది మృతి

పంజాబ్లోని బఠిండాలో ఓ బస్సు కాలువలోకి దూసుకెళ్లిన ఘటనలో 8 మంది మృతి చెందారు. స్థానిక MLA జగ్పూర్ సింగ్ గిల్ తెలిపిన వివరాల మేరకు వంతెనపై రెయిలింగ్ను ఢీకొనడంతో బస్సు కాలువలో పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు ఆయన తెలిపారు. 18 మంది ప్రయాణికులు షాహిద్ భాయ్ మణిసింగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Similar News
News December 1, 2025
కడప: వాయిదా పడిన డిగ్రీ పరీక్ష.. మళ్లీ ఎప్పుడంటే.!

దిత్వా తుఫాను కారణంగా వాయిదా పడిన యోగివేమన విశ్వవిద్యాలయ డిగ్రీ, పీజీ పరీక్షల తేదీలను విశ్వవిద్యాలయ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ కె.ఎస్.వి. కృష్ణారావు సోమవారం ప్రకటించారు. డిసెంబర్ 1వ తేదీన డిగ్రీ వారికి జరగాల్సిన పరీక్షను ఈ నెల 6వ తేదీ ఉదయం నిర్వహిస్తున్నామన్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇంటిగ్రేటెడ్ పీజీ విద్యార్థులకు ఈనెల 9వ తేదీ ఉదయం పరీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు.
News December 1, 2025
పాలమూరు జిల్లాకు కేసీఆర్ ఏం చేయలేదు: సీఎం రేవంత్

TG: పాలమూరు నుంచి ఎంపీగా చేసిన మాజీ సీఎం KCR ఈ జిల్లాకు ఏం చేయలేదని CM రేవంత్ అన్నారు. తమ ప్రభుత్వం వచ్చాకే కొడంగల్, నారాయణపేట ప్రాజెక్టులను ప్రారంభించామని మక్తల్ సభలో పేర్కొన్నారు. ‘రైతులు నష్టపోవద్దని ఎకరాకు ₹20L పరిహారం ఇస్తున్నాం. రెండేళ్లలో ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. చదువు లేకపోవడం వల్లే మన ప్రాంతం వెనుకబడింది. అందుకే IIIT మంజూరు చేశాం. ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నిర్మిస్తున్నాం’ అని తెలిపారు.
News December 1, 2025
హనుమాన్ చాలీసా భావం – 26

సంకటసే హనుమాన ఛుడావై |
మన క్రమ వచన ధ్యాన జో లావై ||
మనసు, మాట, కర్మ.. ఈ త్రికరణ శుద్ధితో హనుమంతుడిపై భక్తి ఉంచితే ఆయన మనల్ని భయాల నుంచి కాపాడతాడు. కష్టాల నుంచి విముక్తులను చేస్తాడు. మన ఆలోచనలో, ఆచరణలో, మాటలో భక్తి భావం ఉన్నవారికి ఆంజనేయుడి అనుగ్రహం తప్పక లభిస్తుంది. అలా లభించినవారు కష్టాలను దాటి, జీవితంలో అపార విజయాన్ని అందుకుంటారు. <<-se>>#HANMANCHALISA<<>>


