News December 27, 2024

కాలువ‌లో ప‌డిన బ‌స్సు.. 8 మంది మృతి

image

పంజాబ్‌లోని బ‌ఠిండాలో ఓ బ‌స్సు కాలువ‌లోకి దూసుకెళ్లిన ఘ‌ట‌న‌లో 8 మంది మృతి చెందారు. స్థానిక MLA జ‌గ్పూర్ సింగ్ గిల్ తెలిపిన వివ‌రాల మేర‌కు వంతెన‌పై రెయిలింగ్‌ను ఢీకొన‌డంతో బ‌స్సు కాలువ‌లో పడిపోయింది. ఈ ఘ‌ట‌న‌లో ఐదుగురు అక్క‌డికక్క‌డే మృతి చెంద‌గా, మ‌రో ముగ్గురు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన‌ట్టు ఆయ‌న తెలిపారు. 18 మంది ప్ర‌యాణికులు షాహిద్ భాయ్ మ‌ణిసింగ్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు.

Similar News

News October 28, 2025

సాగునీటి ప్రాజెక్టుల సేఫ్టీపై నివేదికలివ్వండి: రేవంత్‌రెడ్డి

image

TG: ఇరిగేషన్ ప్రాజెక్టులపై కేంద్రమంత్రి CR పాటిల్ రాసిన లేఖపై CM రేవంత్‌రెడ్డి అధికారులతో చర్చించారు. ప్రాజెక్టుల భద్రతపై తీసుకోవలసిన చర్యలపై సూచనలు చేశారు. లేఖలో పేర్కొన్న ప్రాజెక్టులతో పాటు అన్ని డ్యాములపై నివేదికలివ్వాలని ఆదేశించారు. సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల రిపేర్లు చేయించాలని, వీటి బాధ్యత ఆయా ఏజెన్సీలే వహించేలా చూడాలన్నారు. NOV 2వ వారంలో మరోసారి సమీక్షిస్తానని సీఎం తెలిపారు.

News October 28, 2025

IRCTCలో 45 పోస్టులు.. అప్లైకి కొన్ని గంటలే ఛాన్స్

image

IRCTC 45 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. టెన్త్, ఐటీఐ అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వయసు 15 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంది. టెన్త్, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.9,600 స్టైపెండ్ చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://irctc.com/

News October 28, 2025

కర్ణాటక ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ

image

ప్రైవేట్ సంస్థలు ప్రభుత్వ స్థలాల్లో మీటింగ్స్ పెట్టుకోవడానికి ముందు పర్మిషన్ తీసుకోవాలంటూ కర్ణాటక ప్రభుత్వమిచ్చిన ఆర్డర్స్‌పై ఆ రాష్ట్ర హైకోర్టు స్టే ఇచ్చింది. ఇది ప్రాథమిక హక్కులకు విరుద్ధమని, దీని వల్ల పది మంది పార్కులో పార్టీ చేసుకున్నా నేరమే అవుతుందని పిటిషనర్ తరఫు లాయర్ వాదించారు. కోర్టు విచారణను NOV 17కు వాయిదా వేసింది. కాగా RSSను కట్టడి చేసేందుకే ప్రభుత్వం ఈ ఆర్డరిచ్చిందని విమర్శలొచ్చాయి.