News March 17, 2024
అద్దంకిలో బస్సు బోల్తా.. 15 మందికి గాయాలు

అద్దంకి మండలం అమ్మాయిపాలెం గ్రామ సమీపంలో ఆదివారం ప్రమాదవశాత్తు ప్రైవేట్ బస్సు బోల్తా పడి 15 మందికి గాయాలయ్యాయి. బొద్దికూరపాడుకు చెందిన సుబ్బారెడ్డి తమ కుటుంబ సభ్యులతో మనవరాలు పుట్టువెంట్రుకలు తీసుకునేందుకు బస్సులో కోటప్పకొండకు వెళ్తుండగా ఈప్రమాదం జరిగింది. స్థానికులు వెంటనే క్షతగాత్రులను బయటకు తీసి అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు అక్కడికి చేరుకొని ట్రాఫిక్ క్లియర్ చేశారు.
Similar News
News January 23, 2026
కందుకూరు LICలో రూ.3 కోట్ల స్కాం.!

కందుకూరు LICలో భారీ స్కాం బయటపడింది. పూర్వాశ్రమంలో ఏజెంట్గా ఉండి తర్వాత డెవలప్మెంట్ ఆఫీసర్గా మారిన పూజల శ్రీనివాస్ పథకం ప్రకారం స్కాంకు పాల్పడ్డాడు. దొంగ పాలసీలు చేయించి నకిలీ డెత్ సర్టిఫికెట్లతో రూ.3 కోట్లు కాజేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. కొత్త సాప్ట్వేర్తో ఈ స్కాం గుట్టు రట్టయినట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News January 23, 2026
ప్రకాశం: రూ.144 చెల్లిస్తే కొండంత భరోసా..!

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పాడి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం రాయితీతో కూడిన బీమాను ఈనెల 19నుంచి అమల్లోకి తెచ్చింది. కేవలం 15% చెల్లింపుతో ఆవు, గేదె, గొర్రె, మేకలు చనిపోతే పాడిరైతు ఖాతాలో నగదు జమవుతోంది. ఈనెల 31వరకు జరుగే పశుఆరోగ్య శిబిరాల్లో నమోదు చేసుకోవాలి. మేలుజాతి ఆవులు, గేదెలు ఒక్కోదానికి మూడేళ్లకు రూ.288, నాటుజాతి పశువులకు మూడేళ్లకు రూ.144, గొర్రెలు, మేకలకు మూడేళ్ల కాలానికి రూ.56 చెల్లించాలి.
News January 23, 2026
ఒంగోలు మీదుగా అమృత్ భారత్ ఎక్స్ప్రెస్..!

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కొత్తగా తాంబరం–సంత్రాగాచి–తాంబరం అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ (16107/16108) వారానికి ఒకసారి నడవనుంది. జనవరి 23 నుంచి తాంబరం నుంచి, జనవరి 24 నుంచి సంత్రాగాచి నుంచి సేవలు ప్రారంభం కానున్నాయి. ఈ రైలు ఒంగోలు మీదుగా ప్రయాణించనుంది. ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందించనుందని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి.


