News June 13, 2024
బస్సు టికెట్ ధరలు పెరిగాయా? లేదా?.. అసలు విషయం ఇది!!

TGSRTC ఛార్జీల పెంపుపై కొందరు ప్రయాణికుల్లో అయోమయం నెలకొంది. బస్సుల్లో సాధారణ ఛార్జీలు పెరిగాయనడంలో ఎలాంటి వాస్తవం లేదని ఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు. కేంద్రం టోల్ ఛార్జీలను పెంచడంతో టికెట్లోని టోల్ సెస్ను సవరించామన్నారు. దీంతో టోల్ ప్లాజాలు ఉన్న నేషనల్ హైవే రూట్లలో పదిరోజుల క్రితమే టికెట్పై రూ.3 చొప్పున పెంచారు. దీంతో ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ప్రయాణికులపై భారం పడ్డట్లే.
Similar News
News March 24, 2025
5 స్టార్ ఏసీ వాడితే.. 60 శాతం కరెంట్ ఆదా

5 స్టార్ రేటెడ్ ACలు వాడితే 60% వరకు విద్యుత్ ఆదా అవుతుందని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ(BEE) సౌత్ఇండియా మీడియా అడ్వైజర్ చంద్రశేఖర్ తెలిపారు. దేశంలో వాడుతున్న ACల్లో అత్యధికం 8ఏళ్ల కంటే పాతవని, ఇవి 40-50% విద్యుత్ అధికంగా వినియోగిస్తున్నట్లు అధ్యయనాలు చెప్పాయన్నారు. ACని 24°C వద్ద వాడటం ఉత్తమమన్నారు. 5స్టార్ రేటెడ్ ACలతో భూతాపాన్ని తగ్గించడంతో పాటు గ్రీన్ హౌజ్ గ్యాసెస్ని అరికట్టవచ్చని తెలిపారు.
News March 24, 2025
మరోసారి పెళ్లి పీటలెక్కబోతున్న జెఫ్ బెజోస్

అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మరోసారి పెళ్లి పీటలెక్కబోతున్నారు. తన ప్రియురాలు లారెన్ శాంచెజ్ను వివాహం చేసుకోనున్నారు. ఈ మేరకు ఆహ్వాన పత్రికల పంపిణీ మెుదలు పెట్టారు. ఇటలీ వెనిస్లో వీరి మ్యారేజ్ జరగనుంది. అయితే ఇప్పటి వరకూ వివాహ తేదీ అధికారికంగా ప్రకటించలేదు. 2023లో వీరి నిశ్చితార్థం జరిగింది. జెఫ్ బెజోస్ 2019తో తన మెుదటి భార్య మెకెంజీతో విడాకులు తీసుకున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నారు.
News March 24, 2025
పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్.. ఆరుగురు అరెస్ట్!

TG: ఈనెల 21న నల్గొండ జిల్లా నకిరేకల్ గురుకులంలో తెలుగు ప్రశ్నాపత్రం లీక్ కావడం కలకలం రేపింది. ఎగ్జామ్ మొదలైన కాసేపటికే క్వశ్చన్ పేపర్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. దీంతో విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు తాజాగా పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ గోపాల్, డిపార్ట్మెంటల్ అధికారి రామ్మోహన్ను విధుల నుంచి తొలగించారు. ఇదే కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.