News November 17, 2024

రూ.8 లక్షలతో వ్యాపారం.. ఇప్పుడు రూ.23,567 కోట్ల సామ్రాజ్యం

image

ఫిన్‌టెక్ కంపెనీ mobikwik ఫౌండర్ బిపిన్ ప్రీత్‌సింగ్ సక్సెస్ స్టోరీ స్ఫూర్తినిస్తోంది. ఢిల్లీ IITలో చదివిన ఆయన డిజిటల్ పేమెంట్స్ హవాను 2000లోనే గుర్తించారు. 9ఏళ్లు కష్టపడి 2009లో ₹8లక్షల సేవింగ్స్‌తో చిన్న రూమ్‌లో MobiKwikను ప్రారంభించారు. భార్య ఉపాసన సహకారంతో కంపెనీని వృద్ధి చేశారు. ప్రస్తుతం ఆ యాప్‌‌‌లో 10కోట్ల మంది యూజర్లు ఏటా $2bn లావాదేవీలు జరుపుతున్నారు. కంపెనీ విలువ ₹23,567కోట్లకు చేరింది.

Similar News

News November 18, 2025

ప్రభుత్వంపై విమర్శలు.. 65 ఏళ్ల మహిళకు 30 ఏళ్ల జైలు శిక్ష

image

వెనిజులాలో నికోలస్ మదురో ప్రభుత్వాన్ని విమర్శించిన వారిపై అక్కడి కోర్టు ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా వాట్సాప్ ఆడియో మెసేజ్‌లో నికోలస్‌ను విమర్శించిన మార్గీ ఒరోజ్కో అనే 65 ఏళ్ల వైద్యురాలికి ఏకంగా 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఆమెపై రాజద్రోహం, ద్వేషాన్ని ప్రేరేపించారనే నిందలు మోపింది. కాగా ప్రస్తుతం వెనిజులాలో 882 మంది రాజకీయ ఖైదీలు జైళ్లలో మగ్గుతున్నట్లు ఓ NGO వెల్లడించింది.

News November 18, 2025

ప్రభుత్వంపై విమర్శలు.. 65 ఏళ్ల మహిళకు 30 ఏళ్ల జైలు శిక్ష

image

వెనిజులాలో నికోలస్ మదురో ప్రభుత్వాన్ని విమర్శించిన వారిపై అక్కడి కోర్టు ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా వాట్సాప్ ఆడియో మెసేజ్‌లో నికోలస్‌ను విమర్శించిన మార్గీ ఒరోజ్కో అనే 65 ఏళ్ల వైద్యురాలికి ఏకంగా 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఆమెపై రాజద్రోహం, ద్వేషాన్ని ప్రేరేపించారనే నిందలు మోపింది. కాగా ప్రస్తుతం వెనిజులాలో 882 మంది రాజకీయ ఖైదీలు జైళ్లలో మగ్గుతున్నట్లు ఓ NGO వెల్లడించింది.

News November 18, 2025

మారేడుమిల్లిలో ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోలు మృతి

image

AP: అల్లూరి జిల్లా మారేడుమిల్లి అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసులు-మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మరణించారు. మృతుల్లో ఛత్తీస్‌గఢ్ మావోయిస్టు అగ్రనేతలున్నట్లు సమాచారం. టైగర్ జోన్‌లో కూంబింగ్ కొనసాగుతోంది. ఏపీ-ఛత్తీస్‌గఢ్-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో పోలీసులు ఈ ఆపరేషన్ మొదలుపెట్టారు.