News February 21, 2025
కిలో రూ.8కి కొనండి: అచ్చెన్నాయుడు

AP: టమాటాలకు గిట్టుబాటు ధరలపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కిలో రూ.8కి కొని రైతుబజార్లకు పంపాలని అధికారులను మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. MIS, నాఫెడ్, NCCF ద్వారా టమాటాలు కొనుగోలు చేసి తెలంగాణ, తమిళనాడు, మధ్యప్రదేశ్, మహారాష్ట్రకు పంపాలని అధికారులకు సూచించారు. ఇలా పొరుగు రాష్ట్రాలకు ఎగుమతి చేయడం ద్వారా కిలోకు రూ.15 వరకు ధర వస్తుందని, కొంత పంటను ప్రాసెసింగ్ యూనిట్లకూ పంపుతున్నామని చెప్పారు.
Similar News
News March 25, 2025
గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్న రైతులు: బొత్స

AP: చంద్రబాబు పాలనలో ప్రకృతి కూడా రైతులకు అనుకూలంగా ఉండదని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. పంటలకు గిట్టుబాటు ధర లేక అన్నదాతలు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మిర్చి రైతుల పరిస్థితి దారుణంగా ఉందని, ఇప్పటి వరకు ప్రభుత్వం ఒక్క కేజీ అయినా కొనుగోలు చేసిందా? అని ప్రశ్నించారు. ధర లేక చెరుకు పంటను రైతులే కాల్చుకునే పరిస్థితి ఉందన్నారు.
News March 25, 2025
దీపక్ హుడాకు అబ్బాయిలంటే ఇష్టం: స్వీటీ

కబడ్డీ ప్లేయర్ దీపక్ హుడాపై ఆయన భార్య స్వీటీ బూరా సంచలన ఆరోపణలు చేశారు. హుడాకు అబ్బాయిలంటే ఆసక్తి అని చెప్పారు. తాను విడాకులు ఇవ్వమని కోరుతున్నానని, ఎలాంటి ఆస్తిని అడగట్లేదని పేర్కొన్నారు. దీపక్ తనను దారుణంగా వేధించడమే కాకుండా చెడుగా చిత్రీకరిస్తున్నాడని తెలిపారు. కాగా దీపక్ తనను వేధిస్తున్నాడని స్వీటీ పోలీసులకు <<15878772>>ఫిర్యాదు చేసిన<<>> సంగతి తెలిసిందే.
News March 25, 2025
నాకోసం యువీ ఎండలో నిలబడేవారు: KKR డేంజరస్ బ్యాటర్

తన బ్యాటింగ్ స్కిల్ మెరుగవ్వడంలో ప్రపంచకప్ల హీరో యువరాజ్ సింగ్ పాత్ర ఉందని KKR యువ బ్యాటర్ రమణ్దీప్ సింగ్ అన్నారు. ఆయనలా బ్యాటింగ్ చేయాలన్నదే తన ధ్యేయమని చెప్పారు. ‘యువీ కొన్నిసార్లు తన ప్రాక్టీస్ వదిలి నేను ప్రాక్టీస్ చేసే PCA స్టేడియం వచ్చేవారు. కొన్నిసార్లు అంపైర్ ప్లేస్లో ఎండలో నిలబడి గంటల కొద్దీ వీడియోలు రికార్డు చేసేవారు. వాటిని ఇంటికెళ్లి విశ్లేషించి నాకు సలహాలు ఇచ్చేవారు’ అని తెలిపారు.