News July 29, 2024

ఎలక్ట్రిక్ వెహికల్ కొంటున్నారా?

image

ఈవీలపై ఇచ్చే సబ్సిడీ గడువును కేంద్రం పొడిగించింది. జులై 31తో సబ్సిడీ ముగియనుండగా దాన్ని సెప్టెంబర్ 30 వరకు పెంచుతున్నట్లు గెజిట్ విడుదల చేసింది. దీని ప్రకారం టూవీలర్ కొనుగోలుపై రూ.10,000 వరకు, స్మాల్ త్రీవీలర్‌పై రూ.25వేల వరకు, లార్జ్ త్రీవీలర్‌పై రూ.50వేల వరకు సర్కార్ సబ్సిడీ ఇస్తుంది. దేశంలో ఈవీల వాడకాన్ని పెంచేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

Similar News

News April 8, 2026

IPL: గిల్ రీఎంట్రీ.. GT బోణీ కొడుతుందా?

image

ఐపీఎల్‌లో ఈరోజు ఢిల్లీ వేదికగా DC, GT రా.7.30 గంటలకు తలపడనున్నాయి. ఈ సీజన్‌లో DC ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచుల్లో గెలిచి ఫామ్‌లో ఉండగా, GT ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓడింది. దీంతో ఈరోజైనా గెలిచి ఆ జట్టు బోణీ కొడుతుందేమో చూడాలి. టోర్నీ చరిత్రలో ఇరు జట్లు ఇప్పటివరకు 7 సార్లు తలపడగా, GT 4 విజయాలతో పైచేయి సాధించింది. కండరాల నొప్పితో గత మ్యాచ్‌కు దూరమైన గుజరాత్ కెప్టెన్ గిల్ ఈ మ్యాచులో ఆడనున్నారు.

News April 8, 2026

ఇరాన్‌కు డెడ్‌లైన్ గడువును పొడిగించిన ట్రంప్

image

ఇరాన్‌కు విధించిన డెడ్‌లైన్ గడువును 2 వారాలపాటు పొడిగిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. <<19594813>>పాక్ అభ్యర్థన<<>> మేరకు 14 రోజులపాటు దాడులు నిలిపివేసేందుకు అంగీకరించానన్నారు. ‘హార్ముజ్‌ను వెంటనే తెరిచేందుకు ఇరాన్ అంగీకరించిందన్న షరతుకు లోబడి దీనికి నేను ఒప్పుకున్నా. ఈ సీజ్‌ఫైర్ ఇరువైపులా వర్తిస్తుంది. ఇరాన్ 10 పాయింట్ల ప్రపోజల్‌ అందింది. శాంతి ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి’ అని పేర్కొన్నారు.

News April 8, 2026

నోటిఫైడ్ డిసీజ్‌గా క్యాన్సర్‌.. ప్రతీ కేసు వివరాలు చెప్పాల్సిందే!

image

TG: క్యాన్సర్‌ను నోటిఫైడ్ డిసీజ్‌గా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఇకపై రాష్ట్రంలో ఎక్కడ క్యాన్సర్ కేసు నమోదైనా ప్రభుత్వానికి సమాచారమివ్వాలని ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రులను ఆదేశించింది. బాధితుల వివరాలను గోప్యంగా ఉంచి, వాటిని నెల రోజుల్లో ప్రభుత్వ పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించింది. సరైన వైద్య విధానాల రూపకల్పనకు, స్క్రీనింగ్ టెస్టులు చేసేందుకు ఈ డేటా సాయపడుతుందని అధికారులు తెలిపారు.